యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం..మరో రెండు నెలలు పొడిగింపు..!
- November 01, 2024
యూఏఈ: రెండు నెలల పాటు యూఏఈ వీసా అమ్నెస్టీ ప్రోగ్రామ్ను పొడిగిస్తున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ పథకం, డిసెంబర్ 31తో ముగుస్తుంది. వేలాది మంది నివాసితులు తమ వీసా స్టేటస్ని క్రమబద్ధీకరించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఐసిపి డైరెక్టర్ జనరల్ మేజర్-జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ మాట్లాడుతూ.. యూఏఈ 53వ యూనియన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్షమాభిక్ష గడువును పొడిగించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముందుగా నిర్ణయించిన తుది గడువు అక్టోబరు 31కి ముందు దరఖాస్తుదారుల సంఖ్య పెరిగినట్లు అల్ ఖైలీ తెలిపారు. ఈ క్రమంలో మరో రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. తుడి గడువు ముగిసాక చట్టాలు ఉల్లంఘించిన వారిపై ICP తనిఖీలు తీవ్రతరం చేస్తుందన్నారు. ఓవర్స్టేయర్లు యూఏఈలోని ఏదైనా ICP కేంద్రాలు, అలాగే ఆమోదించబడిన టైపింగ్ సెంటర్లు, ఆన్లైన్ ఛానెల్లలో దరఖాస్తు చేసుకోవచ్చని ICP తెలిపింది.
తాజా వార్తలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు









