యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం..మరో రెండు నెలలు పొడిగింపు..!
- November 01, 2024
యూఏఈ: రెండు నెలల పాటు యూఏఈ వీసా అమ్నెస్టీ ప్రోగ్రామ్ను పొడిగిస్తున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ పథకం, డిసెంబర్ 31తో ముగుస్తుంది. వేలాది మంది నివాసితులు తమ వీసా స్టేటస్ని క్రమబద్ధీకరించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఐసిపి డైరెక్టర్ జనరల్ మేజర్-జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ మాట్లాడుతూ.. యూఏఈ 53వ యూనియన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్షమాభిక్ష గడువును పొడిగించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముందుగా నిర్ణయించిన తుది గడువు అక్టోబరు 31కి ముందు దరఖాస్తుదారుల సంఖ్య పెరిగినట్లు అల్ ఖైలీ తెలిపారు. ఈ క్రమంలో మరో రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. తుడి గడువు ముగిసాక చట్టాలు ఉల్లంఘించిన వారిపై ICP తనిఖీలు తీవ్రతరం చేస్తుందన్నారు. ఓవర్స్టేయర్లు యూఏఈలోని ఏదైనా ICP కేంద్రాలు, అలాగే ఆమోదించబడిన టైపింగ్ సెంటర్లు, ఆన్లైన్ ఛానెల్లలో దరఖాస్తు చేసుకోవచ్చని ICP తెలిపింది.
తాజా వార్తలు
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!







