రెడ్ ప్యాలెస్కి పునర్ వైభవం.. జాతీయ సెలవుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు..!!
- November 01, 2024
కువైట్: జహ్రాలోని చారిత్రాత్మక రెడ్ ప్యాలెస్కు పునర్ వైభవాన్ని తెచ్చేందుకు కువైట్ మునిసిపాలిటీ యోచిస్తోందని ప్రాజెక్ట్ డైరెక్టర్ రావన్ అల్-ధఫిరి తెలిపారు. కువైట్కు గొప్ప చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్యాలెస్.. కువైట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లెటర్స్ పర్యవేక్షణలో నిపుణుల బృందంచే పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తిపారు. ఈ ప్యాలెస్ అల్-జహ్రాను రక్షించడానికి 1897లో నిర్మించారు. 1920లో జహ్రా యుద్ధానికి ఇది సాక్ష్యంగా నిలిచింది.
ఫిబ్రవరి 2025లో కువైట్ జాతీయ సెలవుల కోసం రెడ్ ప్యాలెస్లో ప్రత్యేక కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. కువైట్ మునిసిపాలిటీ ఉత్తరాన ప్యాలెస్కు ఆనుకుని 470,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పార్క్, హెరిటేజ్ మార్కెట్ను రూపొందించాలని యోచిస్తోందని ధఫిరి చెప్పారు. ఈ ప్రాజెక్ట్లో పిల్లల కోసం ప్రత్యేక స్థలాలతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు, చారిత్రక గ్రంథాలయం, బహిరంగ థియేటర్, వర్క్షాప్లు, బూత్లు కూడా ఉంటాయన్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ దక్షిణ భాగం సౌక్ అల్-ముబారకియాను గుర్తుకు తెచ్చే హెరిటేజ్ మార్కెట్ను నిర్వహిస్తున్నారు. వీటితోపాటు బంగారు మార్కెట్, ఖర్జూరాల మార్కెట్, బట్టల మార్కెట్తో పాటు ఈవెంట్ల కోసం పెద్ద వేదికతో సహా కువైట్ వారసత్వాన్ని ప్రతిబింబించే డిజైన్లు ఉంటాయని పేర్కొన్నారు. రెడ్ ప్యాలెస్ విలేజ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడుతుందని, ప్రాజెక్ట్ కోసం ప్రీ-క్వాలిఫికేషన్ ప్రక్రియ నవంబర్ 26 వరకు కొనసాగుతుందన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







