బహ్రెయిన్ లో రుణాలు చెల్లించని ప్రవాసులపై ప్రయాణ నిషేధం..!!
- November 03, 2024
మనామా: బహ్రెయిన్ లో రుణాలు చెల్లించని ప్రవాసులపై ప్రయాణ నిషేధం విధించనున్నారు. ఈమేరకు నిబంధనలను సమీక్షించడానికి న్యాయమూర్తుల ప్యానెల్ను ఏర్పాటు చేసేందుకు న్యాయ వ్యవహారాల కమిటీ ఆమోదించింది. వచ్చే మంగళవారం చర్చకు రానుంది. 2021 డిక్రీ నెం. 22 ప్రకారం జారీ చేయబడిన సివిల్, కమర్షియల్ విషయాలలో ఎగ్జిక్యూషన్ చట్టంలోని ఆర్టికల్ 40ని అప్డేట్ చేయాలని ఎంపీ డాక్టర్ మర్యమ్ అల్ ధాన్ ప్రతిపాదన చేశారు. ఇది ఆమోదం పొందినట్లయితే, ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ను ఏర్పాటు చేస్తారు. కొంతమంది తమ అప్పులను పక్కదారి పట్టించడానికి ఉపయోగించే చట్టంలోని అంతరాలను మూసివేయడం ఈ ప్రణాళిక లక్ష్యం అని చెప్పారు. కాగా, యూఏఈలో బహిష్కరణకు గురైన రుణగ్రస్తులు బయలుదేరే ముందు వారి బకాయిలను క్లియర్ చేయాల్సి ఉంటుంది. బహ్రెయిన్ ప్రతిపాదన విదేశీ రుణగ్రస్తులు చెల్లించకుండా వదిలివేసే అవకాశాన్ని తగ్గించడం ద్వారా రుణదాతలను రక్షించే లక్ష్యంతో చర్యలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









