బహ్రెయిన్ లో రుణాలు చెల్లించని ప్రవాసులపై ప్రయాణ నిషేధం..!!
- November 03, 2024
మనామా: బహ్రెయిన్ లో రుణాలు చెల్లించని ప్రవాసులపై ప్రయాణ నిషేధం విధించనున్నారు. ఈమేరకు నిబంధనలను సమీక్షించడానికి న్యాయమూర్తుల ప్యానెల్ను ఏర్పాటు చేసేందుకు న్యాయ వ్యవహారాల కమిటీ ఆమోదించింది. వచ్చే మంగళవారం చర్చకు రానుంది. 2021 డిక్రీ నెం. 22 ప్రకారం జారీ చేయబడిన సివిల్, కమర్షియల్ విషయాలలో ఎగ్జిక్యూషన్ చట్టంలోని ఆర్టికల్ 40ని అప్డేట్ చేయాలని ఎంపీ డాక్టర్ మర్యమ్ అల్ ధాన్ ప్రతిపాదన చేశారు. ఇది ఆమోదం పొందినట్లయితే, ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ను ఏర్పాటు చేస్తారు. కొంతమంది తమ అప్పులను పక్కదారి పట్టించడానికి ఉపయోగించే చట్టంలోని అంతరాలను మూసివేయడం ఈ ప్రణాళిక లక్ష్యం అని చెప్పారు. కాగా, యూఏఈలో బహిష్కరణకు గురైన రుణగ్రస్తులు బయలుదేరే ముందు వారి బకాయిలను క్లియర్ చేయాల్సి ఉంటుంది. బహ్రెయిన్ ప్రతిపాదన విదేశీ రుణగ్రస్తులు చెల్లించకుండా వదిలివేసే అవకాశాన్ని తగ్గించడం ద్వారా రుణదాతలను రక్షించే లక్ష్యంతో చర్యలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







