బహ్రెయిన్ లో రుణాలు చెల్లించని ప్రవాసులపై ప్రయాణ నిషేధం..!!
- November 03, 2024
మనామా: బహ్రెయిన్ లో రుణాలు చెల్లించని ప్రవాసులపై ప్రయాణ నిషేధం విధించనున్నారు. ఈమేరకు నిబంధనలను సమీక్షించడానికి న్యాయమూర్తుల ప్యానెల్ను ఏర్పాటు చేసేందుకు న్యాయ వ్యవహారాల కమిటీ ఆమోదించింది. వచ్చే మంగళవారం చర్చకు రానుంది. 2021 డిక్రీ నెం. 22 ప్రకారం జారీ చేయబడిన సివిల్, కమర్షియల్ విషయాలలో ఎగ్జిక్యూషన్ చట్టంలోని ఆర్టికల్ 40ని అప్డేట్ చేయాలని ఎంపీ డాక్టర్ మర్యమ్ అల్ ధాన్ ప్రతిపాదన చేశారు. ఇది ఆమోదం పొందినట్లయితే, ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ను ఏర్పాటు చేస్తారు. కొంతమంది తమ అప్పులను పక్కదారి పట్టించడానికి ఉపయోగించే చట్టంలోని అంతరాలను మూసివేయడం ఈ ప్రణాళిక లక్ష్యం అని చెప్పారు. కాగా, యూఏఈలో బహిష్కరణకు గురైన రుణగ్రస్తులు బయలుదేరే ముందు వారి బకాయిలను క్లియర్ చేయాల్సి ఉంటుంది. బహ్రెయిన్ ప్రతిపాదన విదేశీ రుణగ్రస్తులు చెల్లించకుండా వదిలివేసే అవకాశాన్ని తగ్గించడం ద్వారా రుణదాతలను రక్షించే లక్ష్యంతో చర్యలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!









