కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!
- November 04, 2024
యూఏఈ: వాహనాల్లోని వస్తువులను దొంగిలిస్తున్న ముసుగు ధరించిన దొంగను రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితుడికి ముప్పై ఏళ్లు ఉంటాయని, వాహనాల అద్దాలు పగలగొట్టి అనేక చోరీలు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసు ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ తారిఖ్ మహ్మద్ బిన్ సైఫ్ తెలిపారు. ఎమిరేట్లోని వివిధ ప్రదేశాలలో వాహన దొంగతనాలకు సంబంధించి లా ఎన్ఫోర్స్మెంట్కు అనేక ఫిర్యాదులు అందాయని, దొంగ తన గుర్తింపును దాచడానికి ముసుగు ధరించి కారు అద్దాలను పగులగొట్టి వస్తువులను దొంగిలించేవాడని వివరించారు. చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు తెలిపారు. వీడియోల ద్వారా కీలక ఆధారాలను సేకరించిన స్పెషల్ టీమ్, నిందితుడిని అదుపులోకి తీసుకుందన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









