కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!
- November 04, 2024
యూఏఈ: వాహనాల్లోని వస్తువులను దొంగిలిస్తున్న ముసుగు ధరించిన దొంగను రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితుడికి ముప్పై ఏళ్లు ఉంటాయని, వాహనాల అద్దాలు పగలగొట్టి అనేక చోరీలు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసు ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ తారిఖ్ మహ్మద్ బిన్ సైఫ్ తెలిపారు. ఎమిరేట్లోని వివిధ ప్రదేశాలలో వాహన దొంగతనాలకు సంబంధించి లా ఎన్ఫోర్స్మెంట్కు అనేక ఫిర్యాదులు అందాయని, దొంగ తన గుర్తింపును దాచడానికి ముసుగు ధరించి కారు అద్దాలను పగులగొట్టి వస్తువులను దొంగిలించేవాడని వివరించారు. చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు తెలిపారు. వీడియోల ద్వారా కీలక ఆధారాలను సేకరించిన స్పెషల్ టీమ్, నిందితుడిని అదుపులోకి తీసుకుందన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







