కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!
- November 04, 2024
యూఏఈ: వాహనాల్లోని వస్తువులను దొంగిలిస్తున్న ముసుగు ధరించిన దొంగను రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితుడికి ముప్పై ఏళ్లు ఉంటాయని, వాహనాల అద్దాలు పగలగొట్టి అనేక చోరీలు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసు ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ తారిఖ్ మహ్మద్ బిన్ సైఫ్ తెలిపారు. ఎమిరేట్లోని వివిధ ప్రదేశాలలో వాహన దొంగతనాలకు సంబంధించి లా ఎన్ఫోర్స్మెంట్కు అనేక ఫిర్యాదులు అందాయని, దొంగ తన గుర్తింపును దాచడానికి ముసుగు ధరించి కారు అద్దాలను పగులగొట్టి వస్తువులను దొంగిలించేవాడని వివరించారు. చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు తెలిపారు. వీడియోల ద్వారా కీలక ఆధారాలను సేకరించిన స్పెషల్ టీమ్, నిందితుడిని అదుపులోకి తీసుకుందన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక







