ఒమన్లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- November 04, 2024
మస్కట్: ధార్మిక నిధుల సేకరణ కార్యకలాపాలను నియంత్రించే లక్ష్యంతో, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MOSD) ప్రజల నుండి డబ్బు వసూలు చేయాలనుకునే ప్రైవేట్ సంస్థలకు కొత్త నిబంధనలను విధించింది. ఏదైనా నిధుల సేకరణ కార్యకలాపాలను ప్రారంభించే ముందు ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా MOSD నుండి లైసెన్స్ పొందాలని నిర్దేశించారు. అయితే, పబ్లిక్ లీగల్ ఎంటిటీలు ఏర్పాటు చేసిన కమిటీలు, సంస్థలు చేపట్టే నిధులకు ఈ నియమం వర్తించదని అధికారులు తెలిపారు. అనుమతి పొందిన సంస్థలు విరాళాల సేకరణకు అప్లికేషన్లు, వెబ్సైట్ల వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించుకోవచ్చు. నిధుల సేకరణ ప్రారంభించిన తర్వాత 15 పనిదినాల్లోగా సంస్థలు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. నిధులను తప్పనిసరిగా ఉద్దేశించిన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి సేకరించిన నిధులను మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







