ఒమన్లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- November 04, 2024
మస్కట్: ధార్మిక నిధుల సేకరణ కార్యకలాపాలను నియంత్రించే లక్ష్యంతో, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MOSD) ప్రజల నుండి డబ్బు వసూలు చేయాలనుకునే ప్రైవేట్ సంస్థలకు కొత్త నిబంధనలను విధించింది. ఏదైనా నిధుల సేకరణ కార్యకలాపాలను ప్రారంభించే ముందు ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా MOSD నుండి లైసెన్స్ పొందాలని నిర్దేశించారు. అయితే, పబ్లిక్ లీగల్ ఎంటిటీలు ఏర్పాటు చేసిన కమిటీలు, సంస్థలు చేపట్టే నిధులకు ఈ నియమం వర్తించదని అధికారులు తెలిపారు. అనుమతి పొందిన సంస్థలు విరాళాల సేకరణకు అప్లికేషన్లు, వెబ్సైట్ల వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించుకోవచ్చు. నిధుల సేకరణ ప్రారంభించిన తర్వాత 15 పనిదినాల్లోగా సంస్థలు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. నిధులను తప్పనిసరిగా ఉద్దేశించిన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి సేకరించిన నిధులను మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







