ఒమన్లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- November 04, 2024
మస్కట్: ధార్మిక నిధుల సేకరణ కార్యకలాపాలను నియంత్రించే లక్ష్యంతో, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MOSD) ప్రజల నుండి డబ్బు వసూలు చేయాలనుకునే ప్రైవేట్ సంస్థలకు కొత్త నిబంధనలను విధించింది. ఏదైనా నిధుల సేకరణ కార్యకలాపాలను ప్రారంభించే ముందు ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా MOSD నుండి లైసెన్స్ పొందాలని నిర్దేశించారు. అయితే, పబ్లిక్ లీగల్ ఎంటిటీలు ఏర్పాటు చేసిన కమిటీలు, సంస్థలు చేపట్టే నిధులకు ఈ నియమం వర్తించదని అధికారులు తెలిపారు. అనుమతి పొందిన సంస్థలు విరాళాల సేకరణకు అప్లికేషన్లు, వెబ్సైట్ల వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించుకోవచ్చు. నిధుల సేకరణ ప్రారంభించిన తర్వాత 15 పనిదినాల్లోగా సంస్థలు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. నిధులను తప్పనిసరిగా ఉద్దేశించిన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి సేకరించిన నిధులను మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









