యాంటీ కార్ థెఫ్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రారంభించిన RAK పోలీసులు
- November 05, 2024
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా (RAK ) పోలీస్ జనరల్ కమాండ్ వారు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తో కలిసి ప్రజలకు తమ విలువైన వస్తువులను మరియు వాహనాలు దొంగతనం నుండి ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించే లక్ష్యంతో ఒక కొత్త భద్రతా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు.
దొంగతనం నుండి తమ వాహనాలు మరియు విలువైన వస్తువులను ఎలా రక్షించుకోవాలో తెలియజేసేలా "మీ వాహనం మరియు విలువైన ఆస్తులను దొంగతనం నుండి రక్షించండి" అనే నినాదాన్ని కలిగి ఉన్న కారు ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా రస్ అల్ ఖైమా పోలీస్లు ప్రజలకు వివిధ రకాల భద్రతా చిట్కాలు మరియు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా, వాహనాలను పార్క్ చేసే సమయంలో ఎల్లప్పుడూ తాళం వేసి ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే విలువైన వస్తువులను వాహనంలో కనిపించే ప్రదేశాల్లో ఉంచకూడదని సూచిస్తున్నారు. వీటితోపాటు వాహనాల భద్రత కోసం అధునాతన సాంకేతిక పరికరాలను ఉపయోగించడం, అలారమ్ సిస్టమ్స్ మరియు జీపిఎస్ ట్రాకింగ్ వంటి పద్ధతులను అమలు చేయడం ద్వారా వాహనాల చోరీని అరికట్టవచ్చని తెలియజేస్తున్నారు.
ఈ ప్రచారం ద్వారా ప్రజలు తమ భద్రతపై మరింత అవగాహన కలిగి, దొంగతనాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రస్ అల్ ఖైమా పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల