హైదరాబాద్ లో రాహుల్ గాంధీ..
- November 05, 2024
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్ర నేత నేత రాహుల్ గాంధీ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు.. మహారాష్ట్ర నుంచి ఆయన విమానంలో బేగంపేటకు వచ్చారు.. విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ కు కారులో చేరుకున్నారు. ఇక బుధవారం నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న కులగణనపై నేడు మేధావులు, ప్రజలు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశం కానున్నారు. వారి నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు.
బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ లో జరిగే ఈ సమావేశంలో రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు 400మందికి అవకాశం ఇచ్చారు. ఇందులో 200మంది పార్టీలోని వివిధ స్థాయి నేతలు ఉన్నారు. 200 మందిలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. మిగతా 200మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారితో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, మేధావులు ఉంటారని పీసీసీ ప్రకటించింది.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









