హైదరాబాద్ లో రాహుల్ గాంధీ..
- November 05, 2024
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్ర నేత నేత రాహుల్ గాంధీ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు.. మహారాష్ట్ర నుంచి ఆయన విమానంలో బేగంపేటకు వచ్చారు.. విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ కు కారులో చేరుకున్నారు. ఇక బుధవారం నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న కులగణనపై నేడు మేధావులు, ప్రజలు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశం కానున్నారు. వారి నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు.
బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ లో జరిగే ఈ సమావేశంలో రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు 400మందికి అవకాశం ఇచ్చారు. ఇందులో 200మంది పార్టీలోని వివిధ స్థాయి నేతలు ఉన్నారు. 200 మందిలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. మిగతా 200మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారితో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, మేధావులు ఉంటారని పీసీసీ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









