కువైట్‌లో 'ఎంపరర్ ఆఫ్ ది మ్యాట్స్'..భారత విద్యార్థికి రజత పతకం..!!

- November 07, 2024 , by Maagulf
కువైట్‌లో \'ఎంపరర్ ఆఫ్ ది మ్యాట్స్\'..భారత విద్యార్థికి రజత పతకం..!!

కువైట్: కువైట్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఎంపరర్ ఆఫ్ ది మ్యాట్స్ IV ఎడిషన్ జుజుట్సు టోర్నమెంట్‌లో భారతీయ విద్యార్థి ఇషాక్ ఇంతియాజ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఎంపరర్ ఆఫ్ ది మ్యాట్స్ అనేది EBI స్టైల్ జుజుట్సు టోర్నమెంట్. ఇది ప్రత్యర్థిని ఓడించడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగించే ఒక యుద్ధ కళ. టోర్నమెంట్ కువైట్‌లో అక్టోబర్ 5న ఫహాహీల్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగింది.

మిస్టర్ ఇషాక్ ఇంతియాజ్.. ప్రఖ్యాత టోర్నమెంట్‌లో పాల్గొన్న ఏకైక భారతీయుడు మంగాఫ్‌లోని ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ (IIS)లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి.భారతదేశంలోని తమిళనాడుకు చెందిన మిస్టర్ ఇషాక్ ఈ అరుదైన మార్షల్ ఆర్ట్స్ కోసం కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన తన తండ్రి మిస్టర్ ఇంతియాజ్ హాజా మైదీన్ నుండి ప్రేరణ పొందినట్టు తెలిపాడు.ఇంతియాజ్ ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థలో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇషాక్ తల్లి స్టార్‌బక్స్ కువైట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com