ముందుగానే వేతనం పొందనున్న అబుధాబీ, దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులు!
- July 07, 2015
అబుధాబీ అధినేత, అధ్యక్షులు- హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ఉపాధ్యక్షులు, యు. ఏ. ఈ. ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తమ విశేషాధికారాలను ఉపయోగించి, ఆగస్టు నెల అబుధాబీ మరియు దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్ ఉల్ ఫిత్ర్ కు ముందుగానే అంటే జులై 22 న వేతనాలివ్వవలసినదిగా ఆదేశించారు. హిజ్ హైనెస్ మొహమ్మద్ వారు- ఉద్యోగులు, వారి కుటుంబాలు ఈద్ పర్వదినం సందర్భంగా వారి అవసరాల మేరకు వేతనాలు అందె లా వారి ఖాతాలో జమ చేయవలసిందిగా బ్యాంకులకు ఆదేశమిచ్చారని, తదనుగుణంగా ఆర్ధిక శాఖ కసరత్తును ప్రారంభించిందని దుబాయ్ ఆర్ధిక శాఖ డైరక్టర్ జనరల్ అబ్దుల్ రహ్మాన్ అల్ సలేహ్ తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







