క్యాపిటల్ చట్టం ఉల్లంఘన.. SR3.95 మిలియన్ ఫైన్.. 6నెలల జైలుశిక్ష..!!
- November 08, 2024
రియాద్: క్యాపిటల్ మార్కెట్ చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగులకు SR 3.95 మిలియన్ల జరిమానా, వారిలో ఒకరికి ఆరు నెలల జైలు శిక్షను క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) విధించింది. క్యాపిటల్ మార్కెట్ చట్టం మరియు కంపెనీల చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు అబ్దుల్లా A. M. అల్-ఖోదారీ సన్స్ కో.కి చెందిన ముగ్గురు ఉద్యోగులను CMA కింద అప్పీల్ కమిటీ ఫర్ ది రిజల్యూషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డిస్ప్యూట్స్ (ACRSD) దోషులుగా నిర్ధారించింది. ACRSD ప్రకారం.. కంపెనీలో ఆర్థిక శాఖ డైరెక్టర్ సొహైల్ సయీద్ మహ్మద్ సయీద్, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కైలాష్ నాథ్ సదాంగి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫవాజ్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్మోహసేన్ అల్ఖోదారీలను దోషులుగా నిర్ధారిస్తూ తుది తీర్పు వెలువరించింది. 2010-17 మధ్య కంపెనీ చేపట్టిన నాలుగు ప్రాజెక్టుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, ఆదాయాన్ని పెంచి చూపారని అభియోగాలను నమోదు చేశారు. ప్రాజెక్ట్ పూర్తి కావడానికిపెట్టిన ఖర్చులు, కంపెనీ రికార్డుల్లో నమోదు చేసిన వాస్తవ వ్యయాలకు భిన్నంగా ఉన్నాయని విచారణలో గుర్తించారు. ఇందులోకీలక పాత్ర పోషించిన ఫవాజ్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్మోహ్సేన్ అల్ఖుదారికి ఆరు నెలల జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







