వచ్చే బోర్డు మీటింగ్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం: టీటీడీ ఛైర్మన్
- November 08, 2024
తిరుమల: టీటీడీ నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. తనకు ఆ బాధ్యత అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు బీఆర్ నాయుడు. వచ్చే బోర్డు మీటింగ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి కొన్ని మార్పులు చెయ్యాల్సి ఉందన్నారు. సవాళ్లు ఉన్నాయని, అన్నింటిని అధిగమిస్తామన్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ ఎలా కాపాడుకోవాలి అనే దానిపై దృష్టి పెడతామన్నారు బీఆర్ నాయుడు.
ఉద్యోగాల నియామకాలపై అధ్యయనం చేస్తామన్నారు. శ్రీవాణిపై ప్రజల్లో అపోహ ఉందన్న బీఆర్ నాయుడు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయని టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. టీటీడీ నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 16 మంది పాలక మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం బీఆర్ నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
”బోర్డు లేకపోయినా బ్రహ్మోత్సవాలను చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు మేరకు ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి, అధికారులకు నూతన బోర్డు తరుపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుతూ, ప్రతిష్టను పెంచేలా చర్యలు చేపడతాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తాం” అని బీఆర్ నాయుడు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల