వాహనదారులు అలెర్ట్.. పోలీసు కెమెరాల నిఘాలో దుబాయ్ రోడ్లు..!!
- November 09, 2024
దుబాయ్: రోడ్ల పై దుబాయ్ పోలీసుల స్మార్ట్ కెమెరాలతో నిఘా పెట్టింది. ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలనైనా గుర్తిస్తాయని అధికార యంత్రాంగం హెచ్చరించింది. కెమెరాల పనితీరుకు సంబంధించి రెండు ఉదంతాలను వెల్లడించింది. ఒక మహిళా వాహనదారుడు ఒకటి కాదు రెండు ఫోన్లను వినియోగిస్తూ కెమెరాలకు చిక్కాడు. మరొక డ్రైవర్ న్యూస్ పేపర్ చదువుతూ దొరికిపోయాడు. ట్రాఫిక్ వ్యవస్థల ఉల్లంఘనలను సరికొత్త సాంకేతికతలతో అమర్చని కెమెరాలు తేలికగా క్యాప్చర్ చేస్తాయని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం, టైల్గేటింగ్ వంటి ట్రాఫిక్ నేరాలకు వాహనాలను 30 రోజుల వరకు స్వాధీనం చేసుకుంటామని అల్ మజ్రోయి వాహనదారులకు గుర్తు చేశారు. ఈ నేరాలకు Dh 4000, Dh1,000 మధ్య జరిమానాలతోపాటు నాలుగు బ్లాక్ పాయింట్లను విధిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







