వాహనదారులు అలెర్ట్.. పోలీసు కెమెరాల నిఘాలో దుబాయ్ రోడ్లు..!!
- November 09, 2024
దుబాయ్: రోడ్ల పై దుబాయ్ పోలీసుల స్మార్ట్ కెమెరాలతో నిఘా పెట్టింది. ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలనైనా గుర్తిస్తాయని అధికార యంత్రాంగం హెచ్చరించింది. కెమెరాల పనితీరుకు సంబంధించి రెండు ఉదంతాలను వెల్లడించింది. ఒక మహిళా వాహనదారుడు ఒకటి కాదు రెండు ఫోన్లను వినియోగిస్తూ కెమెరాలకు చిక్కాడు. మరొక డ్రైవర్ న్యూస్ పేపర్ చదువుతూ దొరికిపోయాడు. ట్రాఫిక్ వ్యవస్థల ఉల్లంఘనలను సరికొత్త సాంకేతికతలతో అమర్చని కెమెరాలు తేలికగా క్యాప్చర్ చేస్తాయని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం, టైల్గేటింగ్ వంటి ట్రాఫిక్ నేరాలకు వాహనాలను 30 రోజుల వరకు స్వాధీనం చేసుకుంటామని అల్ మజ్రోయి వాహనదారులకు గుర్తు చేశారు. ఈ నేరాలకు Dh 4000, Dh1,000 మధ్య జరిమానాలతోపాటు నాలుగు బ్లాక్ పాయింట్లను విధిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







