బిలియార్డ్స్‌ వరల్డ్ టైటిల్ భారత్‌దే.. సత్తా చాటిన పంకజ్ అద్వాణీ

- November 10, 2024 , by Maagulf
బిలియార్డ్స్‌ వరల్డ్ టైటిల్ భారత్‌దే.. సత్తా చాటిన పంకజ్ అద్వాణీ

ఇండియన్ క్యూ స్పోర్ట్ లెజెండ్ పంకజ్ అద్వాణీ 18వ ప్రపంచ బిలియార్డ్స్, 28వ బిలియార్డ్స్, స్నూకర్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. శనివారం ఖతార్‌లోని దోహాలో జరిగిన 2024 ఐబీఎస్‌ఎఫ్ 150 అప్ బిలియార్డ్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగింది.అద్వాణీ ఇంగ్లాండ్‌కు చెందిన రాబర్ట్ హాల్‌ను ఫైనల్‌లో 4-2 తేడాతో ఓడించాడు. 150 అప్ ఫార్మాట్ ఐబీఎస్ఎఫ్ బిలియార్డ్స్‌ ఛాంపియన్ షిప్‌ను వరుసగా ఏడోసారి పంకజ్ అద్వాణీ గెలుచుకున్నాడు. అద్వాణీ ఆట మొదటి నుంచి ప్రత్యర్థిని డామినేట్ చేస్తూ వచ్చాడు. ఫస్ట్ మూడు ఫ్రేమ్‌ల్లో(151-94, 151-0, 150-84) లీడ్ సాధించాడు. అయితే ఇంగ్లాండ్ ఆటగాడు హాల్ గట్టి పోటీని ఇచ్చి వరుసగా రెండు ఫ్రేమ్‌లు (151-74, 151-6) గెలిచి ఆటలో నిలిచాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com