దుబాయ్ లో ఇప్పటి వరకు 32 మంది మృతి..పోలీసుల వార్నింగ్..!!
- November 14, 2024
దుబాయ్: దుబాయ్లో ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారని, వాహనదారులు ఆకస్మికంగా దూసుకెళ్లడం వల్లేనని దుబాయ్ పోలీసు అధికారి ధృవీకరించారు. ఇది రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుందని దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ అవేర్నెస్ విభాగం అధిపతి సల్మా మహ్మద్ రాషెడ్ అల్మర్రి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దుబాయ్లో రోడ్డు మరణాలకు అకస్మాత్తుగా లైన్లు మారడం పెద్ద కారణంగా ఉందన్నారు. ఈ సంఘటనల వెనుక డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు, అలసట లేదా పరధ్యానాన్ని ఎదుర్కొంటారని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ల వాడకం కారణాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుందన్నారు. డ్రైవింగ్లో మొబైల్ ఫోన్లను ఉపయోగించకుండా దుబాయ్ పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారని పేర్కొన్నారు.
వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తే డ్రైవింగ్ లైసెన్స్లపై 400 నుండి 1,000 దిర్హామ్ల వరకు జరిమానాతోపాటు నాలుగు బ్లాక్ పాయింట్లు,30 రోజుల పాటు వాహనాలను సీజ్ చేసే అవకాశం ఉందన్నారు. రద్దీగా ఉండే ట్రాఫిక్లో లేన్ల మధ్య వెళ్లడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఆగస్ట్లో దుబాయ్ హైవేపై వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఒక విద్యార్థి మరణించగా, మరో 11 మంది గాయపడ్డారని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







