దుబాయ్ లో ఇప్పటి వరకు 32 మంది మృతి..పోలీసుల వార్నింగ్..!!
- November 14, 2024
దుబాయ్: దుబాయ్లో ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారని, వాహనదారులు ఆకస్మికంగా దూసుకెళ్లడం వల్లేనని దుబాయ్ పోలీసు అధికారి ధృవీకరించారు. ఇది రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుందని దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ అవేర్నెస్ విభాగం అధిపతి సల్మా మహ్మద్ రాషెడ్ అల్మర్రి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దుబాయ్లో రోడ్డు మరణాలకు అకస్మాత్తుగా లైన్లు మారడం పెద్ద కారణంగా ఉందన్నారు. ఈ సంఘటనల వెనుక డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు, అలసట లేదా పరధ్యానాన్ని ఎదుర్కొంటారని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ల వాడకం కారణాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుందన్నారు. డ్రైవింగ్లో మొబైల్ ఫోన్లను ఉపయోగించకుండా దుబాయ్ పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారని పేర్కొన్నారు.
వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తే డ్రైవింగ్ లైసెన్స్లపై 400 నుండి 1,000 దిర్హామ్ల వరకు జరిమానాతోపాటు నాలుగు బ్లాక్ పాయింట్లు,30 రోజుల పాటు వాహనాలను సీజ్ చేసే అవకాశం ఉందన్నారు. రద్దీగా ఉండే ట్రాఫిక్లో లేన్ల మధ్య వెళ్లడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఆగస్ట్లో దుబాయ్ హైవేపై వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఒక విద్యార్థి మరణించగా, మరో 11 మంది గాయపడ్డారని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!







