2028 నాటికి చమురు రంగంలో 95% కువైటీకరణ..!!
- November 14, 2024
కువైట్: 2024 మొదటి త్రైమాసికంలో చమురు రంగంలో పనిచేసే కువైటీల శాతం 91 శాతానికి చేరుకోవడంతో, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) దాని అనుబంధ సంస్థలను 2025ని జాతీయులను రిక్రూట్ చేసుకునే సంవత్సరంగా గుర్తించాలని కోరింది. చమురు రంగంలో 2028 నాటికి పనిచేసే కువైటీల శాతం 95 శాతం కంటే ఎక్కువకు చేరుతుందని భావిస్తున్నారు. నివేదిక ప్రకారం.. చమురు కంపెనీలలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే సిటిజన్స్ కు పరీక్ష ప్రక్రియలో మరింత సౌలభ్యం కల్పించారు. KPC తాజా కువైట్ గ్రాడ్యుయేట్లకు ప్రధాన చమురు కంపెనీలలో ఒకదానిలో పని చేయడానికి ఉద్యోగ ఆఫర్ను ఇటీవల ప్రకటించడం రాబోయే సంవత్సరాల్లో మొత్తం కువైటీకరణ వ్యూహానికి అనుగుణంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







