ఎమిరేట్స్ లవ్స్ ఇండియా డే ఈవెంట్.. మెట్రో వేళలు పొడిగింపు..!!
- November 16, 2024
యూఏఈ: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) మెట్రో ఆపరేటింగ్ వేళలను పొడిగించింది. నవంబర్ 16 ఉదయం 5 గంటల నుండి అమల్లోకి వచ్చిన ఈ కొత్త సమయాలు నవంబర్ 17 ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు ఉంటాయి. ఎమిరేట్స్ లవ్స్ ఇండియా డే ఈవెంట్కు హాజరయ్యే వారి కోసం మెట్రో సమయాలను పొడిగించినట్లు వెల్లడించారు. దుబాయ్లోని జబీల్ పార్క్లో జరిగే గ్రాండ్ ఈవెంట్తో యూఏఈలోని భారతీయ కమ్యూనిటీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ 'దీపావళి'ని జరుపుకోనున్నారు. ఈవెంట్స్ సందర్భంగా భారతీయ సంస్కృతిక ప్రదర్శనలతోపాటు బాద్షా, జోనితా గాంధీ, ఇండీ రాక్ బ్యాండ్ అవియల్తో కాన్సర్టులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. సందర్శకుల కోసం జబీల్ పార్క్ చుట్టూ పార్కింగ్ స్పాట్లు అందుబాటులో ఉంటాయని RTA ప్రకటించింది. దీనితోపాటు అల్ వాస్ల్ ఫుట్బాల్ క్లబ్లోని పార్కింగ్ స్థలం, బూమ్ విలేజ్ నుండి ఈవెంట్ ప్రదేశానికి ఉచిత షటిల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







