ఎమిరేట్స్ లవ్స్ ఇండియా డే ఈవెంట్.. మెట్రో వేళలు పొడిగింపు..!!
- November 16, 2024
యూఏఈ: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) మెట్రో ఆపరేటింగ్ వేళలను పొడిగించింది. నవంబర్ 16 ఉదయం 5 గంటల నుండి అమల్లోకి వచ్చిన ఈ కొత్త సమయాలు నవంబర్ 17 ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు ఉంటాయి. ఎమిరేట్స్ లవ్స్ ఇండియా డే ఈవెంట్కు హాజరయ్యే వారి కోసం మెట్రో సమయాలను పొడిగించినట్లు వెల్లడించారు. దుబాయ్లోని జబీల్ పార్క్లో జరిగే గ్రాండ్ ఈవెంట్తో యూఏఈలోని భారతీయ కమ్యూనిటీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ 'దీపావళి'ని జరుపుకోనున్నారు. ఈవెంట్స్ సందర్భంగా భారతీయ సంస్కృతిక ప్రదర్శనలతోపాటు బాద్షా, జోనితా గాంధీ, ఇండీ రాక్ బ్యాండ్ అవియల్తో కాన్సర్టులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. సందర్శకుల కోసం జబీల్ పార్క్ చుట్టూ పార్కింగ్ స్పాట్లు అందుబాటులో ఉంటాయని RTA ప్రకటించింది. దీనితోపాటు అల్ వాస్ల్ ఫుట్బాల్ క్లబ్లోని పార్కింగ్ స్థలం, బూమ్ విలేజ్ నుండి ఈవెంట్ ప్రదేశానికి ఉచిత షటిల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!







