మ్యాచ్ ఫిక్సింగ్..దుబాయ్ లో బ్రెజిల్ జాతీయుడు అరెస్ట్..!!
- November 17, 2024
దుబాయ్: తన దేశంలో మోసానికి పాల్పడినందుకు ఇంటర్పోల్ రెడ్ నోటీసు జాబితాలో ఉన్న బ్రెజిల్ జాతీయుడు విలియం పెరీరా రొగాట్టోను దుబాయ్ పోలీసులు అరెస్టు చేసినట్లు అథారిటీ సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొంది. రొగాట్టో ఫుట్బాల్ మ్యాచ్ల ఫలితాలను తారుమారు చేసి, అంతర్జాతీయ స్పోర్ట్స్ బెట్టింగ్ సైట్లలో చేసిన బెట్టింగ్ల ద్వారా అక్రమ లాభాలను గడించారని కేసులు ఎదుర్కొంటున్నారు. 34 ఏళ్ల రొగాట్టో యూరప్ పర్యటనలో దేశానికి వచ్చిన తర్వాత అరెస్టు చేసినట్లు నేర పరిశోధనల జనరల్ డిపార్ట్మెంట్లోని వాంటెడ్ పర్సన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ తారిఖ్ హిలాల్ అల్ సువైదీ తెలిపారు. అన్ని రకాల అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి దుబాయ్ పోలీసులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







