దుబాయ్ బీచ్లో ఈత కొడుతూ.. 15 ఏళ్ల యువకుడు మృతి..!!
- November 18, 2024
యూఏఈ: దుబాయ్ లో విషాదం చోటుచేసుకుంది. అల్ మమ్జార్ బీచ్ లో ఈత కొడుతుండగా 15 ఏళ్ల భారతీయ ప్రవాసుడు చనిపోయాడు. దుబాయ్లోని న్యూ ఇండియన్ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న అహ్మద్ అబ్దుల్లా మఫాజ్ శుక్రవారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి సరదాగా బీచ్ కు వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
"అతను తన స్నేహితులతో బయటకు వెళ్ళాల్సి ఉండే, మాతో రావాలని కోరగా వచ్చాడని, ఇలా జరుగుతుందని అనుకోలేదు" అని అతని తండ్రి మహ్మద్ అష్రఫ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఒడ్డున ఆడుకుంటుండగా, భారీ కెరటం వాడిని చూస్తుండగానే సముద్రంలో కొట్టుకుపోయాడని విలపించాడు.
ఇదిలా ఉండగా, భయాందోళనకు గురైన కుటుంబం సహాయం కోసం కేకలు వేసిందని, సమీపంలో ఉన్న అరబ్ ఈతగాడు వారికి సహాయం వచ్చాడని, అతను మఫాజ్ సోదరిని రక్షించగలిగాడు, కానీ ఆ బాలుడు అప్పటికి కొట్టుకుపోయాడని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్లో సామాజిక కార్యకర్త, వాలంటీర్ ఇబ్రహీం బెరికే చెప్పారు. శుక్రవారం సాయంత్రం బాలుడి కోసం వెతకగా, శనివారం మృతదేహాం లభ్యమైంది. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఈ కుటుంబం చాలా సంవత్సరాలుగా యూఏఈలో నివసిస్తున్నారు. చనిపోయిన బాలుడు నలుగురు తోబుట్టువులలో మూడవవాడని అతడి బంధువులు తెలిపారు. ఇతర లాంఛనాలు పూర్తయిన తర్వాత బాలుడికి దుబాయ్లోనే అంత్యక్రియలు చేయనున్నట్లు బంధువులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







