యువత భద్రం.. మత్తు పదార్థాల వ్యసనంపై షార్జా పోలీసులు అవగాహన..!!
- November 18, 2024
యూఏఈ: షార్జా మాల్లో ఒక టీనేజ్ కుర్రాడు మత్తుకు బానిసై పరిసరాలను మరిచి పడుకున్న ఫోటో అందరిని కదిలించింది. ముఖ్యంగా పేరెంట్స్ ను కలవరపాటుకు గురిచేసింది. జాహియా సిటీ సెంటర్లో 'మై ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ వెల్త్ 2024' పేరుతో షార్జా పోలీస్ ఎగ్జిబిషన్లో భాగంగా ఈ ఫోటోను ప్రదర్శించారు. నవంబర్ 14న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 21 వరకు కొనసాగుతుంది. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలను హాజరైనవారికి అవగాహన కల్పిస్తున్నారు. ఎగ్జిబిషన్లో క్రిస్టల్ మెత్, గంజాయి, సింథటిక్ గంజాయి (మసాలా) వంటి వివిధ రకాల మాదకద్రవ్యాలను కూడా ప్రదర్శనకు పెట్టారు.
"ఈ ఎగ్జిబిషన్ తల్లిదండ్రులకు వ్యసనం వల్ల కలిగే నష్టాలు, వారి పిల్లలు ఎదుర్కొనే దుష్ర్పభావాలపై అవగాహన కల్పిస్తున్నారు." అని షార్జా పోలీస్ ప్రతినిధి తెలిపారు. యువత మత్తు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







