యువత భద్రం.. మత్తు పదార్థాల వ్యసనంపై షార్జా పోలీసులు అవగాహన..!!
- November 18, 2024
యూఏఈ: షార్జా మాల్లో ఒక టీనేజ్ కుర్రాడు మత్తుకు బానిసై పరిసరాలను మరిచి పడుకున్న ఫోటో అందరిని కదిలించింది. ముఖ్యంగా పేరెంట్స్ ను కలవరపాటుకు గురిచేసింది. జాహియా సిటీ సెంటర్లో 'మై ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ వెల్త్ 2024' పేరుతో షార్జా పోలీస్ ఎగ్జిబిషన్లో భాగంగా ఈ ఫోటోను ప్రదర్శించారు. నవంబర్ 14న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 21 వరకు కొనసాగుతుంది. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలను హాజరైనవారికి అవగాహన కల్పిస్తున్నారు. ఎగ్జిబిషన్లో క్రిస్టల్ మెత్, గంజాయి, సింథటిక్ గంజాయి (మసాలా) వంటి వివిధ రకాల మాదకద్రవ్యాలను కూడా ప్రదర్శనకు పెట్టారు.
"ఈ ఎగ్జిబిషన్ తల్లిదండ్రులకు వ్యసనం వల్ల కలిగే నష్టాలు, వారి పిల్లలు ఎదుర్కొనే దుష్ర్పభావాలపై అవగాహన కల్పిస్తున్నారు." అని షార్జా పోలీస్ ప్రతినిధి తెలిపారు. యువత మత్తు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









