యువత భద్రం.. మత్తు పదార్థాల వ్యసనంపై షార్జా పోలీసులు అవగాహన..!!
- November 18, 2024
యూఏఈ: షార్జా మాల్లో ఒక టీనేజ్ కుర్రాడు మత్తుకు బానిసై పరిసరాలను మరిచి పడుకున్న ఫోటో అందరిని కదిలించింది. ముఖ్యంగా పేరెంట్స్ ను కలవరపాటుకు గురిచేసింది. జాహియా సిటీ సెంటర్లో 'మై ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ వెల్త్ 2024' పేరుతో షార్జా పోలీస్ ఎగ్జిబిషన్లో భాగంగా ఈ ఫోటోను ప్రదర్శించారు. నవంబర్ 14న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 21 వరకు కొనసాగుతుంది. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలను హాజరైనవారికి అవగాహన కల్పిస్తున్నారు. ఎగ్జిబిషన్లో క్రిస్టల్ మెత్, గంజాయి, సింథటిక్ గంజాయి (మసాలా) వంటి వివిధ రకాల మాదకద్రవ్యాలను కూడా ప్రదర్శనకు పెట్టారు.
"ఈ ఎగ్జిబిషన్ తల్లిదండ్రులకు వ్యసనం వల్ల కలిగే నష్టాలు, వారి పిల్లలు ఎదుర్కొనే దుష్ర్పభావాలపై అవగాహన కల్పిస్తున్నారు." అని షార్జా పోలీస్ ప్రతినిధి తెలిపారు. యువత మత్తు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









