టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
- November 18, 2024
తిరుమల: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖ శారదా పీఠం భూముల కేటాయింపు కూడా రద్దు చేసింది. టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ అనుసంధానం చేసింది. తిరుమలలోని శారదా పీఠం భవనాలు పూర్తిగా కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు.తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం పై నిషేధం విధించారు.
టీటీడీ కీలక నిర్ణయాలు..
- శ్రీవాణి ట్రస్ట్ రద్దు
- తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం
- టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయం
- ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం
- టీటీడీ నుంచి అన్యమత ఉద్యోగుల తొలగింపు
- ఇతర డిపార్ట్ మెంట్లకు అన్యమత ఉద్యోగులను తరలింపు
- తిరుమల ఫ్లైఓవర్ కు గరుడ వారధి పేరు పునరుద్ధరణ
- మూడు నెలల్లో డంపింగ్ యార్డు తరలించాలని డెసిషన్
- లడ్డూ ప్రసాదంలో మరింత నాణ్యత పెంచాలని నిర్ణయం
- ఔట్ సోరింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని నిర్ణయం
- టీటీడీలో ఉద్యోగులకు 10శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం
- టూరిజం శాఖకు ఇచ్చే 4వేల టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం
- ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం
- శారదా పీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకోవాలని టీటీడీ నిర్ణయం
ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా ఏర్పడిన పాలక మండలి తొలి సమావేశంలో పలు అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యంత వివాదాస్పదంగా మారిన శ్రీవాణి ట్రస్ట్ ను పాలక మండలి రద్దు చేసింది. శ్రీవాణి ట్రస్ట్ నిధులను టీటీడీ ముఖ్య ఖాతాకు మళ్లించాలని ప్రధానంగా నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో గత ప్రభుత్వం రూ.10వేలకు ఒక టికెట్ ను విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను ఆలయాల నిర్మాణం కోసం వినియోగిస్తామని గత పాలక మండలి ప్రకటించింది. అయితే, దీనిపై అనేక వివాదాలు తలెత్తాయి. ఈ నిధులన్నీ పక్కదారి మళ్లాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కొత్త పాలక మండలి శ్రీవాణి ట్రస్ట్ పైనే పూర్తి స్థాయి దృష్టి పెట్టి.. ఆ ట్రస్ట్ ను రద్దు చేసింది. ఆ నిధులన్నీ టీటీడీ ప్రధాన ఖాతాకు మళ్లించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు టీటీడీ నిధులను ప్రైవేట్ బ్యాంకులలో డిపాజిట్ చేస్తూ వచ్చారు. ఇకపై అలా డిపాజిట్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









