జపాన్ పై ఘన విజయం..ఫైనల్స్ కు చేరిన భారత్ !
- November 19, 2024
బీహార్: మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ-2024లో భారత మహిళల జట్టు ఫైనల్స్కు దూసుకెళ్లింది. బీహార్లోని రాజ్గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈరోజు (మంగళవారం) జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 2-0 పాయింట్ల తేడాతో జపాన్ను ఓడించి అజేయంగా ఫైనల్స్లోకి ప్రవేశించింది.
ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో తొలి అర్ధభాగంలో ఇరు జట్లు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయాయి. దీంతో 0-0తో ద్వితీయార్థంలోకి అడుగుపెట్టిన రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
కాగా, ద్వితీయార్థంలో భారత జట్టు రెండు గోల్స్ చేసి ఆధిక్యం సాధించింది. మ్యాచ్ 48వ నిమిషంలో నవనీత్ గోల్ చేయగా… ఎనిమిది నిమిషాల తర్వాత, 56′ లాల్రెమ్సియామి భారత్కు మరో గోల్ అంధించింది. దీంతో భారత మహిళల జట్టు జపాన్ పై 2–0తో విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది.
మరో సెమీఫైనల్లో మలేషియా – చైనా తలపడగా.. చైనా విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. కాగా, ఈ నెల 20న జరిగే ఫైనల్లో భారత్ మరోసారి చైనాతో ఢీ కోననుంది.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









