ఈ పాలు తాగితే చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు దూరం కావచ్చు
- November 20, 2024![11 ఈ పాలు తాగితే చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు దూరం కావచ్చు](https://www.maagulf.com/godata/articles/202411/mlk_1732084894.jpg)
చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా చలికాలంలో శరీరం అంత యాక్టివ్గా ఉండదు. చలికాలంలో వచ్చే వ్యాధుల్ని తట్టుకోవాలంటే శరీరానికి కావాల్సిన పవర్ అందించాలి. అందుకే చలికాలంలో కొన్ని ప్రత్యేక ఆహారాల్ని డైట్లో చేర్చుకోవాలి. చలికాలంలో శరీరానికి కావాల్సిన శక్తిని అందించి.. ఇమ్యూనిటీ పవర్ పెంచే డ్రింక్స్ తాగాలి. ఈ చలికాలంలో లవంగాల పాలు తాగితే బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ఆ లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ వంటగదిలో ఆహార రుచిని పెంచే అనేక మసాలాలు ఉన్నాయి. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ మసాలాలలో ఒకటి లవంగం. ఇది ఆహార రుచిని రెట్టింపు చేయడంతో పాటు శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. లవంగాలను పాలలో కలుపుకుని తాగితే మరింత ప్రయోజనాలు శరీరానికి చేకూరతాయి. లవంగాలలో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ పాలతో కలిపినప్పుడు వాటి ప్రభావం చాలా రెట్లు పెరుగుతుంది. లవంగం పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలా మంది రక్తపోటు, హై బీపీతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు.. లవంగం పాలు తాగడం వల్ల శరీరంలోని రక్తపోటు స్థాయి అదుపులో ఉంటుంది. రక్తపోటును నియంత్రించే లక్షణాలు లవంగాల్లో ఉన్నాయి. అందుకే బీపీ రోగులు లవంగాల పాలు తాగాలి. ప్రతి రోజూ తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, అజీర్ణం, కడుపునొప్పి వంటి కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడేవారు లవంగం పాలు తాగాలి. లవంగాల పాలు తాగితే జీర్ణవ్యవస్థను బలపడుతుంది. పొట్టను శుభ్రపరచడంలో లవంగాలు సాయపడతాయి. లవంగాల్ని పాలులో కలిపి తాగితే జీవ క్రియ వేగవంతం అవుతుంది.
లవంగం పాలు తాగడం వల్ల శరీరానికి బలం చేకూరి అలసట, బద్ధకం తొలగిపోతాయి. ఇందులో ఉండే క్యాల్షియం, పొటాషియం శరీరంలో కొత్త శక్తిని నింపుతాయి. చలికాలంలో వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధులను తట్టుకోవడానికి రోగనిరోధక శక్తి అవసరం. ఈ పాలు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జలుబు, దగ్గుతో బాధపడేవారికి ఇది సూపర్ డ్రింక్.
లవంగాలలో కాల్షియం ఉంటుంది. పాలలో కూడా కాల్షియం ఉంటుంది. ఈ రెండింటిని పాలలో కలిపి తాగడం వల్ల కాల్షియం నాణ్యత పెరుగుతుంది. ప్రతి రోజూ ఈ పాలు తాగడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. పంటి నొప్పి, చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన మొదలైన సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఒక గ్లాసు పాలు పాత్రలో తీసుకుని గ్యాస్ పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోండి. పాలులో కొన్ని లవంగాల్ని వేయండి. రుచికి కాస్త బెల్లం జోడించండి. పాలు బాగా మరిగిన తర్వాత వడకట్టి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. లవంగాల్ని పొడి చేసుకుని కూడా పాలులో కలుపుకోవచ్చు. ప్రతి రోజూ ఈ పాలు తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. కావాలనుకుంటే మీరు చిటికెలు పసుపు కూడా కలుపుకోవచ్చు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!