బ్రహ్మానందం, రమ్యకృష్ణ కూడా షూటింగ్ మొదలుపెట్టారు..
- June 25, 2016
కమల్ హాసన్ హీరోగా ఒకేసారి తెలుగు, తమిళం, హిందీలలో రూపొందుతున్న 'శభాష్ నాయుడు' సినిమా షూటింగు జోరుగా సాగుతోంది. దీనికోసం బ్రహ్మానందం, రమ్యకృష్ణ కూడా షూటింగ్ మొదలుపెట్టారట. వీళ్లిద్దరివీ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలని, అమెరికాలో కొనసాగుతున్న షూటింగులో వీళ్లిద్దరూ పాల్గొంటున్నారని సినిమా వర్గాలు తెలిపాయి. వాళ్ల పాత్రల చిత్రీకరణతో ఇప్పటికే రెండు రోజుల షూటింగ్ పూర్తయిందని, వాళ్ల పాత్రల షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్తారని చెప్పారు.దశావతారం సినిమాలో సీబీఐ ఆఫీసర్ బలరాం నాయుడిగా ఒక పాత్ర పోషించిన కమల్.. అదే పాత్రను ప్రధాన పాత్రగా తీసుకుని దానికి సీక్వెల్ లా ఈ సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి-2 సినిమా షూటింగుతో కూడా బిజీగా ఉన్న రమ్యకృష్ణ.. ఈ సినిమాలో కమల్ భార్య పాత్ర పోషిస్తున్నారు. వీళ్ల కుమార్తెగా కమల్ కూతురు శ్రుతి హాసన్ నటిస్తున్నారు. సినిమాకు కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే, డిసెంబర్ 1న సినిమా విడుదలవుతుంది.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









