చంద్రబాబునాయుడు హాంకాంగ్కు చేరుకున్నారు..
- June 25, 2016
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాంకాంగ్కు చేరుకున్నారు. సాయంత్రం 4:35కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హాంకాంగ్ వెళ్లారు. అలాగే రాత్రి రాత్రి 7:30 నుంచి 10గంటల వరకు వివిధ రంగాల వ్యాపార ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే శ్రీలంక వాణిజ్య మంత్రి సమర విక్రమతో కూడా బాబు భేటీ కానున్నారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యుఎస్ఏ ఎండీ సనిటా నాయర్తో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.
ఇక రేపు మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ ష్క్వాబ్తో భేటీ కానున్నారు. రేపు సాయంత్రం డబ్ల్యూఈఎఫ్ వేదికగా జరిగే సిటీస్ బై డిజైన్, నాట్ డిమాండ్ అంశంపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. అంతేగాక షేపింగ్ ఏ ఫుడ్ సిస్టమ్ ఎజెండా అంశంపై కూడా ఆయన ప్రసంగించనున్నారు. రేపు రాత్రి ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే 'షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్' చర్చాగోష్ఠిలో చంద్రబాబు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







