ఏపీ: డ్రగ్స్ పై డేగ కన్ను
- November 28, 2024
అమరావతి: డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఈగల్’ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈగల్ కోసం సిబ్బందిని డిప్యూటేషన్పై తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
కాగా, ఈగల్కు సంబంధించి అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈగల్ ఫోర్స్ కోసం రూ.8.59 కోట్లు కేటాయించిన ప్రభుత్వం… ఫోర్స్లో చేరిన వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే.. డ్రగ్స్ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో మొత్తం ఐదు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై హైకోర్టుకు నివేదించామని ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









