ఏపీ: డ్రగ్స్ పై డేగ కన్ను
- November 28, 2024
అమరావతి: డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఈగల్’ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈగల్ కోసం సిబ్బందిని డిప్యూటేషన్పై తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
కాగా, ఈగల్కు సంబంధించి అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈగల్ ఫోర్స్ కోసం రూ.8.59 కోట్లు కేటాయించిన ప్రభుత్వం… ఫోర్స్లో చేరిన వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే.. డ్రగ్స్ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో మొత్తం ఐదు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై హైకోర్టుకు నివేదించామని ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









