ఏపీ: డ్రగ్స్ పై డేగ కన్ను
- November 28, 2024
అమరావతి: డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఈగల్’ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈగల్ కోసం సిబ్బందిని డిప్యూటేషన్పై తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
కాగా, ఈగల్కు సంబంధించి అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈగల్ ఫోర్స్ కోసం రూ.8.59 కోట్లు కేటాయించిన ప్రభుత్వం… ఫోర్స్లో చేరిన వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే.. డ్రగ్స్ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో మొత్తం ఐదు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై హైకోర్టుకు నివేదించామని ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







