జీసీసీ మినిస్ట్రియల్ భేటీ.. గాజా, లెబనాన్ పరిణామాలపై సమీక్ష..!!
- November 29, 2024
కువైట్: తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సుప్రీం కౌన్సిల్ 162వ సన్నాహక మంత్రివర్గ సమావేశం చర్చించింది. ముఖ్యంగా గాజా స్ట్రిప్, లెబనాన్లో పరిణామాలను సమీక్షించారు. కువైట్లో కువైట్ విదేశాంగ మంత్రి, ప్రస్తుత మంత్రివర్గ సెషన్ ఛైర్మన్ అబ్దుల్లా అల్-యాహ్యా అధ్యక్షతన జరిగిన సమావేశానికి సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ హాజరయ్యారు. డిసెంబరు 1వ తేదీన కువైట్ సిటీలో జరగనున్న జిసిసి సుప్రీం కౌన్సిల్ 45వ సెషన్ ఎజెండాపై ఈ సమావేశం చర్చించి ఖరారు చేస్తోంది. జిసిసి రాష్ట్రాల నేతలు, దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. సన్నాహక సమావేశంలో పాల్గొన్న జీసీసీ దేశాల విదేశాంగ మంత్రులు..ఉమ్మడి గల్ఫ్ పురోగతిని మరింత మెరుగుపరచడానికి ఉన్న మార్గాలపై సమీక్షించారు. తక్షణ కాల్పుల విరమణ, పాలస్తీనా సమస్యకు న్యాయమైన సమగ్రమైన పరిష్కారాన్ని చూపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
తాజా వార్తలు
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...









