ఇండియన్ ఎంబసీ ప్రత్యేక చొరవ.. లేబర్ లా అవేర్నెస్ సెషన్ సక్సెస్..!!
- November 29, 2024
కువైట్: కువైట్ కార్మిక చట్టాలపై భారతీయ కమ్యూనిటీ సభ్యులలో అవగాహన పెంచడానికి సమాచార సెషన్ను కువైట్లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించింది. ఈ సెషన్లో పబ్లిక్ మ్యాన్పవర్ అథారిటీ (PAM), డొమెస్టిక్ లేబర్ ఆఫీస్ (DLO) అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాయబారి ఆదర్శ్ స్వైకా మాట్లాడుతూ.. సమస్యలో ఉన్న భారతీయ పౌరులకు సహాయం చేయడానికి రాయబార కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. ఫిర్యాదులను పరిష్కరించడానికి తమ అత్యవసర వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్లు 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు. నవంబర్ 29 వఫ్రాలో కాన్సులర్ క్యాంపును నిర్వహిస్తోందని, ప్రవాస భారతీయులు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం కువైట్లోని ప్రైవేట్ సెక్టార్, డొమెస్టిక్ సెక్టార్ వర్కర్లకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను అధికారులు వివరించారు. ఈ సెషన్లో వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు, కువైట్లోని వివిధ కంపెనీలు, రిక్రూటింగ్ ఏజెన్సీలకు చెందిన హెచ్ఆర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







