ఇండియన్ ఎంబసీ ప్రత్యేక చొరవ.. లేబర్ లా అవేర్నెస్ సెషన్ సక్సెస్..!!
- November 29, 2024
కువైట్: కువైట్ కార్మిక చట్టాలపై భారతీయ కమ్యూనిటీ సభ్యులలో అవగాహన పెంచడానికి సమాచార సెషన్ను కువైట్లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించింది. ఈ సెషన్లో పబ్లిక్ మ్యాన్పవర్ అథారిటీ (PAM), డొమెస్టిక్ లేబర్ ఆఫీస్ (DLO) అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాయబారి ఆదర్శ్ స్వైకా మాట్లాడుతూ.. సమస్యలో ఉన్న భారతీయ పౌరులకు సహాయం చేయడానికి రాయబార కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. ఫిర్యాదులను పరిష్కరించడానికి తమ అత్యవసర వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్లు 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు. నవంబర్ 29 వఫ్రాలో కాన్సులర్ క్యాంపును నిర్వహిస్తోందని, ప్రవాస భారతీయులు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం కువైట్లోని ప్రైవేట్ సెక్టార్, డొమెస్టిక్ సెక్టార్ వర్కర్లకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను అధికారులు వివరించారు. ఈ సెషన్లో వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు, కువైట్లోని వివిధ కంపెనీలు, రిక్రూటింగ్ ఏజెన్సీలకు చెందిన హెచ్ఆర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్









