Dh107 మిలియన్ల పన్ను ఎగవేత, మనీలాండరింగ్.. 15మందిపై కేసులు నమోదు..!!
- December 07, 2024
యూఏఈ: యూఏఈ అటార్నీ-జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ, వివిధ అరబ్ దేశాలకు చెందిన 15 మంది వ్యక్తులను క్రిమినల్ కోర్టుకు తరలించాలని ఆదేశించారు. వీరిలో కొందరు కస్టడీలో ఉండగా, మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఫోర్జరీ, మనీలాండరింగ్ , పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 కంపెనీలపై కేసులు నమోదు చేశారు
అమాయకులపై బాధితులే లక్ష్యంగా ఈ ముఠా మోసం చేయడానికి ఒక క్రిమినల్ ముఠాగా ఏర్పడినందని విచారణలో వెల్లడైంది. ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య ఛాంబర్లు, కస్టమ్స్కు ఆపాదించబడిన అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసి తప్పుదారి పట్టించారు. ఈ నకిలీ పత్రాలు వారు తమ క్రిమినల్ స్కీమ్ కోసం స్థాపించిన కంపెనీలను ఉపయోగించి కొనుగోలు చేశామయ, వ్యాట్ చెల్లించి, విదేశాలకు ఎగుమతి చేసినట్టు తప్పుగా క్లెయిమ్ చేసిన కల్పిత వస్తువులపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) కోసం చట్టవిరుద్ధంగా వాపసు పొందేందుకు వీలు కల్పించిందని అధికారులు తెలిపారు. మొత్తంగా Dh107 మిలియన్లకు పైగా మోసం చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







