'దుబాయ్ వాక్' ప్రాజెక్ట్ను ప్రకటించిన షేక్ మహమ్మద్..!!
- December 08, 2024
దుబాయ్: సైకిల్-స్నేహపూర్వక నగరంగా దుబాయ్ మారనుంది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ వాకింగ్ విస్తృతమైన నెట్వర్క్ ప్రణాళికను ప్రకటించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, 'దుబాయ్ వాక్' అనే ప్రాజెక్ట్లో 3,300 కి.మీ నడక మార్గాల అభివృద్ధి ప్రాజెక్టును X లో ప్రకటించారు. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, అల్ రాస్ అనే రెండు ప్రాంతాలలో ప్రారంభం కానున్న ఈ బృహత్తర ప్రాజెక్ట్, నగరాన్ని ఏడాది పొడవునా పాదచారులకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు.ఈ ప్రాజెక్టులో 110 పాదచారుల వంతెనలు ,సొరంగాలు, 112 కిమీ వాటర్ ఫ్రంట్ మార్గాలు, 124 కిమీ గ్రీన్ వాకింగ్ ట్రైల్స్, 150 కిమీ గ్రామీణ మరియు పర్వత పాదచారుల మార్గాలు ఉంటాయని తెలిపారు. ఎమిరేట్ ద్వారా 6,500 కి.మీ కంటే ఎక్కువ ఇంటర్కనెక్టడ్ పాత్వేలను ఏర్పాటు చేయాలని ప్లాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









