'దుబాయ్ వాక్' ప్రాజెక్ట్ను ప్రకటించిన షేక్ మహమ్మద్..!!
- December 08, 2024
దుబాయ్: సైకిల్-స్నేహపూర్వక నగరంగా దుబాయ్ మారనుంది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ వాకింగ్ విస్తృతమైన నెట్వర్క్ ప్రణాళికను ప్రకటించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, 'దుబాయ్ వాక్' అనే ప్రాజెక్ట్లో 3,300 కి.మీ నడక మార్గాల అభివృద్ధి ప్రాజెక్టును X లో ప్రకటించారు. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, అల్ రాస్ అనే రెండు ప్రాంతాలలో ప్రారంభం కానున్న ఈ బృహత్తర ప్రాజెక్ట్, నగరాన్ని ఏడాది పొడవునా పాదచారులకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు.ఈ ప్రాజెక్టులో 110 పాదచారుల వంతెనలు ,సొరంగాలు, 112 కిమీ వాటర్ ఫ్రంట్ మార్గాలు, 124 కిమీ గ్రీన్ వాకింగ్ ట్రైల్స్, 150 కిమీ గ్రామీణ మరియు పర్వత పాదచారుల మార్గాలు ఉంటాయని తెలిపారు. ఎమిరేట్ ద్వారా 6,500 కి.మీ కంటే ఎక్కువ ఇంటర్కనెక్టడ్ పాత్వేలను ఏర్పాటు చేయాలని ప్లాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









