'దుబాయ్ వాక్' ప్రాజెక్ట్ను ప్రకటించిన షేక్ మహమ్మద్..!!
- December 08, 2024
దుబాయ్: సైకిల్-స్నేహపూర్వక నగరంగా దుబాయ్ మారనుంది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ వాకింగ్ విస్తృతమైన నెట్వర్క్ ప్రణాళికను ప్రకటించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, 'దుబాయ్ వాక్' అనే ప్రాజెక్ట్లో 3,300 కి.మీ నడక మార్గాల అభివృద్ధి ప్రాజెక్టును X లో ప్రకటించారు. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, అల్ రాస్ అనే రెండు ప్రాంతాలలో ప్రారంభం కానున్న ఈ బృహత్తర ప్రాజెక్ట్, నగరాన్ని ఏడాది పొడవునా పాదచారులకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు.ఈ ప్రాజెక్టులో 110 పాదచారుల వంతెనలు ,సొరంగాలు, 112 కిమీ వాటర్ ఫ్రంట్ మార్గాలు, 124 కిమీ గ్రీన్ వాకింగ్ ట్రైల్స్, 150 కిమీ గ్రామీణ మరియు పర్వత పాదచారుల మార్గాలు ఉంటాయని తెలిపారు. ఎమిరేట్ ద్వారా 6,500 కి.మీ కంటే ఎక్కువ ఇంటర్కనెక్టడ్ పాత్వేలను ఏర్పాటు చేయాలని ప్లాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము







