700 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. 700 మంది నర్సులు, 1425 కేరళీయుల పై విచారణ..!!
- December 08, 2024
కువైట్: కువైట్లోని బ్యాంకును సుమారు ₹700 కోట్ల మోసం చేసి ఇతర విదేశాలకు పారిపోయిన 700 మంది నర్సులతో సహా 1,425 మంది కేరళీయులపై కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేరళలోని కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో వీటికి సంబంధించి 10 కేసులు నమోదయ్యాయి. కువైట్లోని ఓ బ్యాంకు సీనియర్ అధికారులు కేరళను సందర్శించి శాంతిభద్రతల ఇన్ఛార్జ్ ఏడీజీపీకి ఫిర్యాదు చేయడంతో బ్యాంక్ ఫ్రాడ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఎక్కువ మంది నర్సులు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారని సమాచారం. వారు కువైట్లో పని చేస్తున్నప్పుడు బ్యాంకు నుండి 35,000 KD నుండి 45,000 KD (సుమారు రూ.90 లక్షలు నుండి రూ.1.25 కోట్ల రూపాయలు) మధ్య రుణం తీసుకున్నారు. తరువాత రుణాన్ని తిరిగి చెల్లించకుండా అమెరికా, యూకే, కెనడా వంటి ఇతర దేశాలకు వెళ్లారు. బ్యాంక్ వారి కేరళ చిరునామాతో సహా డిఫాల్టర్ల వివరాలను పోలీసులకు అందజేసింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









