700 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. 700 మంది నర్సులు, 1425 కేరళీయుల పై విచారణ..!!
- December 08, 2024
కువైట్: కువైట్లోని బ్యాంకును సుమారు ₹700 కోట్ల మోసం చేసి ఇతర విదేశాలకు పారిపోయిన 700 మంది నర్సులతో సహా 1,425 మంది కేరళీయులపై కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేరళలోని కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో వీటికి సంబంధించి 10 కేసులు నమోదయ్యాయి. కువైట్లోని ఓ బ్యాంకు సీనియర్ అధికారులు కేరళను సందర్శించి శాంతిభద్రతల ఇన్ఛార్జ్ ఏడీజీపీకి ఫిర్యాదు చేయడంతో బ్యాంక్ ఫ్రాడ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఎక్కువ మంది నర్సులు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారని సమాచారం. వారు కువైట్లో పని చేస్తున్నప్పుడు బ్యాంకు నుండి 35,000 KD నుండి 45,000 KD (సుమారు రూ.90 లక్షలు నుండి రూ.1.25 కోట్ల రూపాయలు) మధ్య రుణం తీసుకున్నారు. తరువాత రుణాన్ని తిరిగి చెల్లించకుండా అమెరికా, యూకే, కెనడా వంటి ఇతర దేశాలకు వెళ్లారు. బ్యాంక్ వారి కేరళ చిరునామాతో సహా డిఫాల్టర్ల వివరాలను పోలీసులకు అందజేసింది.
తాజా వార్తలు
- సౌదీలో ఎక్స్పాట్ డాక్టర్పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..







