మిడిల్ ఈస్ట్ సంక్షోభం..అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది: జైశంకర్
- December 08, 2024
దోహా: .. గాజా స్ట్రిప్లో యుద్ధం కారణంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో జరుగుతున్నది భారతదేశంతో సహా అన్ని దేశాలపై ప్రభావం చూపుతుందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ పేర్కొన్నారు. దోహా ఫోరమ్ 2024లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇండియా భౌగోళికంగా చాలా దూరంలో ఉందని, కానీ అది ఈ ప్రాంతానికి కనెక్ట్ అయి ఉందని, మధ్యధరా దేశాలలో అర మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారని, ఇండియా- ఆ దేశాల మధ్య వాణిజ్య పరిమాణం 80 బిలియన్ డాలర్లు ఉందని జైశంకర్ గుర్తుచేశారు. గల్ఫ్లో నివసిస్తున్న 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది భారతీయుల కారణంగా, వాణిజ్య పరిమాణం $180 బిలియన్లకు చేరుకుందని తెలిపారు. ఈ ప్రాంతంలో కీలకమైన అంశం పాలస్తీనా అని జైశంకర్ స్పష్టం చేశారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు దౌత్య మార్గం ఒక్కటే పరిష్కార మార్గమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









