మిడిల్ ఈస్ట్‌ సంక్షోభం..అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది: జైశంకర్

- December 08, 2024 , by Maagulf
మిడిల్ ఈస్ట్‌ సంక్షోభం..అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది: జైశంకర్

దోహా: .. గాజా స్ట్రిప్‌లో యుద్ధం కారణంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో జరుగుతున్నది భారతదేశంతో సహా అన్ని దేశాలపై ప్రభావం చూపుతుందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ పేర్కొన్నారు. దోహా ఫోరమ్ 2024లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇండియా భౌగోళికంగా చాలా దూరంలో ఉందని, కానీ అది ఈ ప్రాంతానికి కనెక్ట్ అయి ఉందని, మధ్యధరా దేశాలలో అర మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారని, ఇండియా- ఆ దేశాల మధ్య వాణిజ్య పరిమాణం 80 బిలియన్ డాలర్లు ఉందని జైశంకర్ గుర్తుచేశారు. గల్ఫ్‌లో నివసిస్తున్న 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది భారతీయుల కారణంగా, వాణిజ్య పరిమాణం $180 బిలియన్లకు చేరుకుందని తెలిపారు. ఈ ప్రాంతంలో కీలకమైన అంశం పాలస్తీనా అని జైశంకర్ స్పష్టం చేశారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు దౌత్య మార్గం ఒక్కటే పరిష్కార మార్గమని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com