మిడిల్ ఈస్ట్ సంక్షోభం..అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది: జైశంకర్
- December 08, 2024
దోహా: .. గాజా స్ట్రిప్లో యుద్ధం కారణంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో జరుగుతున్నది భారతదేశంతో సహా అన్ని దేశాలపై ప్రభావం చూపుతుందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ పేర్కొన్నారు. దోహా ఫోరమ్ 2024లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇండియా భౌగోళికంగా చాలా దూరంలో ఉందని, కానీ అది ఈ ప్రాంతానికి కనెక్ట్ అయి ఉందని, మధ్యధరా దేశాలలో అర మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారని, ఇండియా- ఆ దేశాల మధ్య వాణిజ్య పరిమాణం 80 బిలియన్ డాలర్లు ఉందని జైశంకర్ గుర్తుచేశారు. గల్ఫ్లో నివసిస్తున్న 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది భారతీయుల కారణంగా, వాణిజ్య పరిమాణం $180 బిలియన్లకు చేరుకుందని తెలిపారు. ఈ ప్రాంతంలో కీలకమైన అంశం పాలస్తీనా అని జైశంకర్ స్పష్టం చేశారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు దౌత్య మార్గం ఒక్కటే పరిష్కార మార్గమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







