వాట్సాప్లో 'మెసెజ్ రిమైండర్స్' ఫీచర్-ఇది ఎలా పనిచేస్తుందంటే..?
- December 08, 2024
వాట్సాప్లో మరో అద్భుతమైన ఫీచర్ వచ్చేస్తోంది.ఇది మర్చిపోయిన మెసేజ్లను గుర్తుచేసేందుకు ఉపయోగపడనుంది. 'మెసెజ్ రిమైండర్స్' పేరుతో దీన్ని తీసుకురానున్నారు.
ఈ ఫీచర్ ఉపయోగాలివే..!:
ప్రస్తుతం వాట్సాప్ లేని మొబైల్ లేదంటే అతిశయోక్తి కాదు. మెసెజ్, ఫొటోలు, వీడియోలు షేర్ చేసేందుకు అంతా వాట్సాప్నే వినియోగిస్తున్నారు.దీంతో వాట్సాప్లో పెద్ద ఎత్తున మెసెజెస్ వచ్చి చేరుతుంటాయి.అయితే కొన్ని సందర్భాల్లో మనకు సమయంలేక కొన్ని మెజెస్లను చదవకుండా అలానే వదిలేస్తుంటాం.కొన్ని మెసెజ్లను మాత్రమే ఓపెన్ చేస్తాం.చదివే తీరిక లేక మరికొన్నింటిని తర్వాత చదువుదాంలే అనుకుని మర్చిపోతుంటాం.దీంతో కొన్ని చాట్స్ మరుగున పడిపోతుంటాయి.అలా వదిలేసిన చాట్లను రిమైండ్ చేయాలనే ఉద్దేశంతో వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తన బ్లాగ్ పోస్ట్లో వెల్లడించింది.
ఇది ఎలా పనిచేస్తుందంటే?
ఈ కొత్త వాట్సాప్ 'మెసెజ్ రిమైండర్స్' ఫీచర్ కొన్ని స్పెసిఫిక్ కాంటాక్ట్స్ నుంచి వచ్చిన అన్రీడ్ మెసెజ్లపై అలెర్ట్స్ పంపిస్తుంది. మనం తరచుగా ఎవరితో చాట్ చేస్తున్నామో ఆ కాంటాక్ట్స్ లిస్ట్ ఆధారంగా ఇంటర్నల్ ఆల్గరిథమ్ మనకు ఈ నోటిఫికేషన్లను పంపిస్తుంది. అంటే మనం ఎక్కువగా చాట్ చేస్తున్న కాంటాక్ట్స్ నుంచి వచ్చిన మెసెజ్లను మధ్యలో కొన్ని చాట్స్ కారణంగా మర్చిపోతే ఈ ఫీచర్ మనకు గుర్తుచేస్తుందన్నమాట.
ఈ 'మెసెజ్ రిమైండర్స్' ఫీచర్ను దాని ప్రీవియస్ అప్డేట్ నుంచి డెవలప్ చేశారు.గతంలో ఈ ఫీచర్ స్టేటస్ అప్డేట్స్ రిమైండింగ్ కోసం మాత్రమే నోటిఫికేషన్లను అందించేది.అయితే తాజాగా చాట్లలో చదవని మెసెజ్లను ట్రాక్ చేయడంలో ఇది మీకు సాయం చేస్తుంది.
అందుబాటులోకి ఎప్పుడు? ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్లో ఉంది. దీంతో ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది.త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
యాక్టివేట్ చేసుకోవడం ఎలా? ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాగానే Settings > Notifications > Reminders ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







