'మిడిల్ ఈస్ట్ భారతదేశానికి ముఖ్యమైనది': జైశంకర్
- December 09, 2024
మనామా: భారతదేశ ఇంధన భద్రత, వాణిజ్యం, విస్తృత ఆర్థిక అనుసంధానానికి మిడిల్ ఈస్ట్ ముఖ్యమైనదని భారతదేశ విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ అన్నారు. "ప్రాంతీయ వ్యూహాత్మక సహకారం" అనే పేరుతో జరిగిన మనామా డైలాగ్ ముగింపు సర్వసభ్య సమావేశంలో జైశంకర్ పాల్గొని మాట్లాడారు. మధ్యప్రాచ్య దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి, లోతైన సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంతో భారతదేశానికి దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయని తెలిపారు. "కేవలం కీలకమైన ఇంధన భాగస్వామి మాత్రమే కాదు, కీలకమైన వాణిజ్య భాగస్వామి" అని పేర్కొన్నారు. భారతదేశం -గల్ఫ్ దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని జైశంకర్ పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి బలమైన మౌలిక సదుపాయాలు, యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. “ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రిస్క్ చేయడమే ఈ రోజు ప్రాథమిక ప్రాధాన్యత. గ్లోబల్ కనెక్టివిటీ చాలా పరిమితంగా ఉంది. మేము ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలపరిచే కొత్త హార్డ్-వైరింగ్పై తాము దృష్టి సారించాము. ”అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ మారిటైమ్, నర్జీ కారిడార్ (IMEC) వాణిజ్య మార్గాలను మెరుగుపరచడానికి, ఆర్థిక స్థితిస్థాపకతను నిర్ధారించడానికి ఉద్దేశించి ఇది ఒక ముఖ్యమైన చొరవ అని ఆయన పేర్కొన్నారు. IMEC ప్రాజెక్ట్ మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, యూరప్తో సహా కీలక ప్రాంతాలను అనుసంధానించడానికి ప్రయత్నిస్తుందని, తద్వారా ఆయా దేశాల వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







