సౌదీ-యూఎస్ బిజినెస్ ఫోరమ్..మెగా ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు స్వాగతం..!!
- December 09, 2024
రియాద్: సౌదీ ఛాంబర్స్ ఫెడరేషన్.. యూఎస్ సహకారంతో రియాద్ లో సౌదీ-యూఎస్ బిజినెస్ ఫోరం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ వాలిద్ అల్-అరైనన్, యూఎస్లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఎంబసీ అలిసన్ దిల్వర్త్ మరియు రెండు దేశాల ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సౌదీ మార్కెట్లో ఎగుమతి అవకాశాలను అన్వేషించడానికి 72 అమెరికన్ కంపెనీలకు ఫోరమ్ స్వాగతం పలికింది. ఎనర్జీ, రవాణా, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ రంగాలలో విస్తరించి ఉన్న కింగ్డమ్ విజన్ 2030 మెగా-ప్రాజెక్ట్లలో పెట్టుబడి అవకాశాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేక ప్రభుత్వ అభివృద్ధి నిధుల ద్వారా కింగ్డమ్ ఊహించిన $7 ట్రిలియన్ల వ్యయంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. యూఎస్ ట్రేడ్ మిషన్ సందర్శన సౌదీ అరేబియాకు వినూత్నమైన అమెరికన్ ఎగుమతులు, ఉత్పత్తులు, సేవలను పరిచయం చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
2023లో సౌదీ అరేబియా - యునైటెడ్ స్టేట్స్ మధ్య వాణిజ్య మార్పిడి $34 బిలియన్లకు చేరుకుంది. ఇలాంటి ఫోరమ్లు ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, రెండు దేశాలలో ప్రభుత్వ / ప్రైవేట్ రంగాల మధ్య నిరంతర చర్చల ద్వారా సమగ్ర భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటాయని ఇరుపక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి