డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్..!
- December 09, 2024
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ ను చంపేస్తానంటూ ఆగంతకుడు రెండుసార్లు ఫోన్ చేశాడు. పవన్ పై అభ్యంతరకర భాషతో మేసేజ్ లు పంపించాడు. బెదిరింపు కాల్స్, మేసేజ్ లను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు సిబ్బంది. బెదిరింపుల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు పవన్. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్ పై డీజీపీతో హోంమంత్రి అనిత మాట్లాడారు.
రెండుసార్లు ఆగంతకుడు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు హోంమంత్రి అనితకు తెలిపారు డీజీపీ. నెంబర్ ను వెంటనే ట్రేస్ చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు హోంమంత్రి అనిత. ప్రజాప్రతినిధుల పట్ల ఈ విధమైన చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. పవన్ ను చంపేస్తామంటూ హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం, అసభ్య పదజాలంతో సందేశాలు పంపడం అనేది చర్చనీయాంశంగా మారింది. బెదిరింపు కాల్స్, సందేశాల అంశాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి, పోలీసుల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు డీజీపీ. అటు హోంమంత్రి అనిత కూడా వెంటనే స్పందించారు. డీజీపీతో మాట్లాడారు. బెదిరింపు కాల్స్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది? అనేది ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి