డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్..!
- December 09, 2024
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ ను చంపేస్తానంటూ ఆగంతకుడు రెండుసార్లు ఫోన్ చేశాడు. పవన్ పై అభ్యంతరకర భాషతో మేసేజ్ లు పంపించాడు. బెదిరింపు కాల్స్, మేసేజ్ లను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు సిబ్బంది. బెదిరింపుల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు పవన్. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్ పై డీజీపీతో హోంమంత్రి అనిత మాట్లాడారు.
రెండుసార్లు ఆగంతకుడు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు హోంమంత్రి అనితకు తెలిపారు డీజీపీ. నెంబర్ ను వెంటనే ట్రేస్ చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు హోంమంత్రి అనిత. ప్రజాప్రతినిధుల పట్ల ఈ విధమైన చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. పవన్ ను చంపేస్తామంటూ హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం, అసభ్య పదజాలంతో సందేశాలు పంపడం అనేది చర్చనీయాంశంగా మారింది. బెదిరింపు కాల్స్, సందేశాల అంశాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి, పోలీసుల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు డీజీపీ. అటు హోంమంత్రి అనిత కూడా వెంటనే స్పందించారు. డీజీపీతో మాట్లాడారు. బెదిరింపు కాల్స్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది? అనేది ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









