'వివేకానికి ప్రాధాన్యత ఇవ్వండి'.. సిరియాకు యూఏఈ పిలుపు..!!
- December 10, 2024
యూఏఈ: సిరియన్ అరబ్ రిపబ్లిక్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు యూఏఈ తెలిపింది. సిరియన్ ఐక్యత, సమగ్రతకు, అలాగే సోదర సిరియన్ ప్రజలకు భద్రత స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటిస్తుంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఒక ప్రకటన విడుదల చేసింది. సిరియా చరిత్రలో ఈ క్లిష్టమైన సమయంలో సిరియన్ జనాభాలోని అన్ని వర్గాల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చే విధంగా వివేకానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని సిరియన్ పార్టీలకు పిలుపునిచ్చింది.ఇంకా, సిరియా జాతీయ రాజ్యాన్ని, దాని సంస్థలను రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
దాదాపు రెండు వారాల పోరాటం తర్వాత తిరుగుబాటుదారుల సైన్యం నాలుగు కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నారు. డమాస్కస్లోకి ప్రవేశించగానే, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ డమాస్కస్ నుండి తెలియని గమ్యస్థానానికి వెళ్లినట్లు సీనియర్ ఆర్మీ అధికారులు చెప్పారు. డమాస్కస్ ఇప్పుడు "బషర్ అల్ అస్సాద్ లేకుండా" ఉందని విదేశాలలో ఉన్న సిరియా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హదీ అల్-బహ్రా సిరియన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







