'వివేకానికి ప్రాధాన్యత ఇవ్వండి'.. సిరియాకు యూఏఈ పిలుపు..!!
- December 10, 2024
యూఏఈ: సిరియన్ అరబ్ రిపబ్లిక్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు యూఏఈ తెలిపింది. సిరియన్ ఐక్యత, సమగ్రతకు, అలాగే సోదర సిరియన్ ప్రజలకు భద్రత స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటిస్తుంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఒక ప్రకటన విడుదల చేసింది. సిరియా చరిత్రలో ఈ క్లిష్టమైన సమయంలో సిరియన్ జనాభాలోని అన్ని వర్గాల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చే విధంగా వివేకానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని సిరియన్ పార్టీలకు పిలుపునిచ్చింది.ఇంకా, సిరియా జాతీయ రాజ్యాన్ని, దాని సంస్థలను రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
దాదాపు రెండు వారాల పోరాటం తర్వాత తిరుగుబాటుదారుల సైన్యం నాలుగు కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నారు. డమాస్కస్లోకి ప్రవేశించగానే, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ డమాస్కస్ నుండి తెలియని గమ్యస్థానానికి వెళ్లినట్లు సీనియర్ ఆర్మీ అధికారులు చెప్పారు. డమాస్కస్ ఇప్పుడు "బషర్ అల్ అస్సాద్ లేకుండా" ఉందని విదేశాలలో ఉన్న సిరియా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హదీ అల్-బహ్రా సిరియన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి