డిసెంబరు 31 డెడ్ లైన్.. బయోమెట్రిక్ పూర్తికి ప్రవాసులకు హెచ్చరిక..!!
- December 10, 2024
కువైట్: బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియలను ఇంకా పూర్తి చేయని ప్రవాసులు డిసెంబర్ 31లోపు పూర్తి చేయవలసిందిగా అంతర్గత మంత్రిత్వ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ, బ్యాంకింగ్ లావాదేవీలు ఆలస్యం లేదా అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు ఈ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యక్తులు తప్పనిసరిగా “మెటా” ప్లాట్ఫారమ్ లేదా “సాహెల్” అప్లికేషన్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని, నిర్ణీత తేదీ, సమయంలో బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియను పూర్తి చేయడానికి వెళ్లాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డిసెంబర్ 31లోపు బయోమెట్రిక్ చేయడంలో విఫలమైన వారికి ప్రభుత్వ, బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడతాయని హెచ్చరించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







