ఇండియా,కువైట్ ఆధ్వర్యంలో హైడ్రోకార్బన్లపై కీలక సమావేశం..!!
- December 12, 2024
కువైట్: ఇండియా, కువైట్ ఆధ్వర్యంలో హైడ్రోకార్బన్స్పై 7వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ (JWG) సమావేశం జరిగింది. భారత పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (IC) ఈషా శ్రీవాస్తవ, కువైట్ చమురు మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఖలీద్ అల్-దేయిన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, వ్యూహాత్మక నిల్వలు, గ్రీన్ హైడ్రోజన్, జీవ ఇంధనాలు, పునరుత్పాదక శక్తితో సహా తక్కువ-కార్బన్ సొల్యూషన్స్ ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించారు. ఏటా ఫ్లాగ్షిప్ ఎనర్జీ ఈవెంట్పై చర్చలు జరపడానికి ఇరుపక్షాలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. 2025, ఫిబ్రవరిలో ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా G20 ప్రెసిడెన్సీలో గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్లో సభ్యత్వం కోసం కువైట్ ఆసక్తిని వ్యక్తం చేసింది. సహకరించాలని భారత్ మద్దతును కోరింది.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







