జెడ్డా బుక్ ఫెయిర్..పాల్గొంటున్న 22 దేశాల నుండి వెయ్యికి పైగా పబ్లిషర్స్..!!
- December 14, 2024
జెడ్డా: జెడ్డా సూపర్డోమ్లో ప్రారంభమైన జెడ్డా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2024లో 22 దేశాల నుండి 1,000 కంటే ఎక్కువ ప్రచురణ సంస్థలు తరలివచ్చాయి. స్థానిక అంతర్జాతీయ ఏజెన్సీలు 450 పెవిలియన్లలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు జరిగే పుస్తకాల ఫెస్టివ్ ను సౌదీ సాహిత్యం, పబ్లిషింగ్, అనువాద కమీషన్ ఈ ఈవెంట్ను నిర్వహిస్తోంది. ఇది డిసెంబర్ 21 వరకు జరుగుతుంది. ప్రవేశం అందరికీ ఉచితం.
ఎగ్జిబిషన్లో 100 కంటే ఎక్కువ కార్యకలాపాలు, అనేక ఉపన్యాసాలు, సెమినార్లు, వర్క్షాప్లతో సహా విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2 -12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఇందులో ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పబ్లిషింగ్ డైరెక్టర్ జనరల్ డా. జెడ్డా బుక్ అబ్దులతీఫ్ అల్-వాసిల్ తెలిపారు. జెడ్డా బుక్ ఫెయిర్ 2024 దాని సందర్శకులను ప్రతిరోజూ ఉదయం 11 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి 12 గంటల వరకు ఉంటుంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







