ఏపీ నుండి ముగ్గురు రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం
- December 16, 2024
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, సానా సతీష్ సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ఈరోజు ఉదయం వారితో చైర్మన్ జగదీప్ దన్ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యసభ ఉప ఎన్నిక ఇటీవల జరిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో వీరు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు 164 స్థానాలను కైవసం చేసుకున్నాయి.దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







