హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- December 17, 2024 , by Maagulf
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు.ఈ సంద‌ర్భంగా హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు.రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఉన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి.. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట చేరుకున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ఆమె ఐదు రోజుల పాటు బొల్లార్‌లోని రాష్ట్రపతి భవన్‌లో బస చేయనున్నారు. కాగా, రాష్ట్ర‌ప‌తి ముర్ము రేపు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com