21న ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకలు
- December 19, 2024
హైదరాబాద్: డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రాండ్ గా క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి.ఇందు కోసం అందరూ సహకరించాలని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ కోరారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై బుధవారం ఇక్కడ రాష్ట్ర స్థాయి కమిటీ, జీహెచ్ఎంసీ అధికా రులతో ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు. బిషప్స్, ఫాదర్స్ ను క్రిస్మస్ విందు వేడుకకు మర్యాదపూర్వకంగా తీసుకొని రావాలని కోరారు. పోలీస్ బందోబస్తు పగడ్బందీగా ఉండాలని, వాహనాల పార్కింగ్ కోసం ఆరు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







