ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికిన ఇండియన్ కమ్యూనిటీ..!!
- December 22, 2024
కువైట్: రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం కువైట్ చేరుకున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీ ఘన స్వాగతం పలికింది. సెయింట్ రెజిస్ హోటల్లో జరిగిన రిసెప్షన్కు ఎంపిక చేసిన భారతీయ పాఠశాలల విద్యార్థులు, భారతీయ వ్యాపార నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు, సంఘంలోని ప్రముఖ సభ్యులు సహా భారతీయ సంఘంలోని ఎంపిక చేసిన సభ్యులు హాజరయ్యారు. 'చెండ మేళం'తో కూడిన రంగుల సాంస్కృతిక ప్రదర్శనతో మోదీకి స్వాగతం పలికారు. ఆయన అభిమాన నేతకు స్వాగతం పలుకుతూ ''మోదీ.. మోడీ..'', 'భారత్ మాతా కీ జై..' అంటూ నినాదాలు చేయడంతో వాతావరణం హోరెత్తింది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







