ఒమన్లో పెరిగిన ఒమనైజేషన్ రేట్లు.. టార్గెట్ రీచ్..!!
- December 22, 2024
మస్కట్: ఒమన్లోని పారిశ్రామిక రంగం ఈ ఏడాది జనవరి నుండి నవంబర్ చివరి వరకు ఒమనైజేషన్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. జాతీయ శ్రామిక శక్తి ఉపాధి కోసం నిర్దేశించిన లక్ష్యాలను 5.5% అధిగమించింది. ఈ మేరకు పారిశ్రామిక రంగంలోని వివిధ స్పెషలైజేషన్లు, రంగాల్లోని కార్మిక మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. నవంబర్ 2024 చివరి నాటికి జాతీయ శ్రామిక శక్తి సుమారు 30,993కి చేరుకుందని, ఈ సంవత్సరం 1,000 మంది ఒమానీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యాన్ని అధిగమించిందని ఇండస్ట్రియల్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎవాల్యుయేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అహ్మద్ బిన్ ఖల్ఫాన్ అల్-బదావి తెలిపారు. రాబోయే కాలంలో టెక్నాలజీ, ప్రత్యేక ఉద్యోగాలను స్థానికీకరించడంపై ఎక్కువ దృష్టి పెడతామన్నారు.2024 మధ్యలో అమలులోకి వచ్చిన పారిశ్రామిక వ్యూహం సానుకూల ఫలితాలను ఇచ్చిందని అల్-బదావి హైలైట్ చేశారు. వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖలోని ఇండస్ట్రియల్ స్ట్రాటజీ టీమ్ ఈ సంస్థలతో వర్క్షాప్లను నిర్వహించడం కూడా కలిసివచ్చిందన్నారు.ఈ ప్రయత్నాలు కొత్త హైటెక్ పరిశ్రమలను స్థాపించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పారిశ్రామిక అభివృద్ధి నిర్వహణను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







