ఒమన్లో పెరిగిన ఒమనైజేషన్ రేట్లు.. టార్గెట్ రీచ్..!!
- December 22, 2024
మస్కట్: ఒమన్లోని పారిశ్రామిక రంగం ఈ ఏడాది జనవరి నుండి నవంబర్ చివరి వరకు ఒమనైజేషన్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. జాతీయ శ్రామిక శక్తి ఉపాధి కోసం నిర్దేశించిన లక్ష్యాలను 5.5% అధిగమించింది. ఈ మేరకు పారిశ్రామిక రంగంలోని వివిధ స్పెషలైజేషన్లు, రంగాల్లోని కార్మిక మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. నవంబర్ 2024 చివరి నాటికి జాతీయ శ్రామిక శక్తి సుమారు 30,993కి చేరుకుందని, ఈ సంవత్సరం 1,000 మంది ఒమానీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యాన్ని అధిగమించిందని ఇండస్ట్రియల్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎవాల్యుయేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అహ్మద్ బిన్ ఖల్ఫాన్ అల్-బదావి తెలిపారు. రాబోయే కాలంలో టెక్నాలజీ, ప్రత్యేక ఉద్యోగాలను స్థానికీకరించడంపై ఎక్కువ దృష్టి పెడతామన్నారు.2024 మధ్యలో అమలులోకి వచ్చిన పారిశ్రామిక వ్యూహం సానుకూల ఫలితాలను ఇచ్చిందని అల్-బదావి హైలైట్ చేశారు. వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖలోని ఇండస్ట్రియల్ స్ట్రాటజీ టీమ్ ఈ సంస్థలతో వర్క్షాప్లను నిర్వహించడం కూడా కలిసివచ్చిందన్నారు.ఈ ప్రయత్నాలు కొత్త హైటెక్ పరిశ్రమలను స్థాపించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పారిశ్రామిక అభివృద్ధి నిర్వహణను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







