ఒమన్లో పెరిగిన ఒమనైజేషన్ రేట్లు.. టార్గెట్ రీచ్..!!
- December 22, 2024
మస్కట్: ఒమన్లోని పారిశ్రామిక రంగం ఈ ఏడాది జనవరి నుండి నవంబర్ చివరి వరకు ఒమనైజేషన్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. జాతీయ శ్రామిక శక్తి ఉపాధి కోసం నిర్దేశించిన లక్ష్యాలను 5.5% అధిగమించింది. ఈ మేరకు పారిశ్రామిక రంగంలోని వివిధ స్పెషలైజేషన్లు, రంగాల్లోని కార్మిక మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. నవంబర్ 2024 చివరి నాటికి జాతీయ శ్రామిక శక్తి సుమారు 30,993కి చేరుకుందని, ఈ సంవత్సరం 1,000 మంది ఒమానీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యాన్ని అధిగమించిందని ఇండస్ట్రియల్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎవాల్యుయేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అహ్మద్ బిన్ ఖల్ఫాన్ అల్-బదావి తెలిపారు. రాబోయే కాలంలో టెక్నాలజీ, ప్రత్యేక ఉద్యోగాలను స్థానికీకరించడంపై ఎక్కువ దృష్టి పెడతామన్నారు.2024 మధ్యలో అమలులోకి వచ్చిన పారిశ్రామిక వ్యూహం సానుకూల ఫలితాలను ఇచ్చిందని అల్-బదావి హైలైట్ చేశారు. వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖలోని ఇండస్ట్రియల్ స్ట్రాటజీ టీమ్ ఈ సంస్థలతో వర్క్షాప్లను నిర్వహించడం కూడా కలిసివచ్చిందన్నారు.ఈ ప్రయత్నాలు కొత్త హైటెక్ పరిశ్రమలను స్థాపించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పారిశ్రామిక అభివృద్ధి నిర్వహణను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









