భారతీయుల కిడ్నాప్.. నలుగురు పాకిస్తానీలకు జైలుశిక్ష, dh1 మిలియన్ ఫైన్..!!
- December 23, 2024
దుబాయ్: పోలీసు అధికారుల వలె నటించి ఇద్దరు భారతీయులను అపహరించి, దోచుకున్న కేసులో నలుగురు పాకిస్తానీలకు ఒక్కొక్కరికి రెండేళ్ళ జైలు శిక్ష, 1 మిలియన్ దిర్హామ్ల జరిమానాను దుబాయ్ కోర్టు విధించింది. ఈ కేసు అల్ రఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది మార్చి 29న చోటుచేసుకుంది.
కోర్టు రికార్డుల ప్రకారం.. బాధితులను కిడ్నాప్ చేసేందుకు ఒక పాకిస్థానీ డ్రైవర్ మరో ముగ్గురు పాకిస్థానీలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మార్చి 29 ఉదయం బాధితులు పెద్ద మొత్తంలో నగదుతో దుబాయ్లోని గోల్డ్ సౌక్కు వెళుతుండగా, డ్రైవర్ వారి సమాచారాన్ని ముఠాకు అందించాడు. ముఠా నల్ల కియా వాహనంలో వారిని అనుసరించింది. నిందితులు అల్ మన్ఖూల్ సమీపంలో బాధితులను ఆపారు. అక్కడ ఇద్దరు నేరస్థులు పోలీసు అధికారులుగా నటిస్తూ బాధితులను వేర్వేరు వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించారు. వారిని అల్ నహ్దాకు తీసుకువెళ్లారు. అక్కడ ముఠా బాధితుల నుండి 1 మిలియన్ దిర్హామ్లు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు వాలెట్లను దొంగిలించారు. బాధితులు వెంటనే ఈ సంఘటనను అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు.అయితే, ఐదో నిందితుడికి కేసులో సంబంధం లేదని తేలడంతో కోర్టు వదిలేసింది. దుబాయ్ కోర్టు విధించిన జైలు శిక్ష ముగిసిన తర్వాత, వారిని దేశం నుండి బహిష్కరిస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







