భారతీయుల కిడ్నాప్.. నలుగురు పాకిస్తానీలకు జైలుశిక్ష, dh1 మిలియన్ ఫైన్..!!
- December 23, 2024
దుబాయ్: పోలీసు అధికారుల వలె నటించి ఇద్దరు భారతీయులను అపహరించి, దోచుకున్న కేసులో నలుగురు పాకిస్తానీలకు ఒక్కొక్కరికి రెండేళ్ళ జైలు శిక్ష, 1 మిలియన్ దిర్హామ్ల జరిమానాను దుబాయ్ కోర్టు విధించింది. ఈ కేసు అల్ రఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది మార్చి 29న చోటుచేసుకుంది.
కోర్టు రికార్డుల ప్రకారం.. బాధితులను కిడ్నాప్ చేసేందుకు ఒక పాకిస్థానీ డ్రైవర్ మరో ముగ్గురు పాకిస్థానీలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మార్చి 29 ఉదయం బాధితులు పెద్ద మొత్తంలో నగదుతో దుబాయ్లోని గోల్డ్ సౌక్కు వెళుతుండగా, డ్రైవర్ వారి సమాచారాన్ని ముఠాకు అందించాడు. ముఠా నల్ల కియా వాహనంలో వారిని అనుసరించింది. నిందితులు అల్ మన్ఖూల్ సమీపంలో బాధితులను ఆపారు. అక్కడ ఇద్దరు నేరస్థులు పోలీసు అధికారులుగా నటిస్తూ బాధితులను వేర్వేరు వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించారు. వారిని అల్ నహ్దాకు తీసుకువెళ్లారు. అక్కడ ముఠా బాధితుల నుండి 1 మిలియన్ దిర్హామ్లు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు వాలెట్లను దొంగిలించారు. బాధితులు వెంటనే ఈ సంఘటనను అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు.అయితే, ఐదో నిందితుడికి కేసులో సంబంధం లేదని తేలడంతో కోర్టు వదిలేసింది. దుబాయ్ కోర్టు విధించిన జైలు శిక్ష ముగిసిన తర్వాత, వారిని దేశం నుండి బహిష్కరిస్తారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







