బకాయిలపై కొరడా ఝలిపించనున్న 'ఎతిసలాత్'
- July 09, 2015
బిల్లు చెల్లించవలసిన సమయం దాటిన 15 రోజుల గ్రేస్ పీరియడ్ అనంతరం సేవలను నిలిపివేస్తామని, యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ టెలికాం సర్వీస్ ప్రవైడర్ ఎతిసలాత్ అధికారులు తెలిపారు. ఈ నిబంధన, బిల్లు చెల్లించవలసిఉన్న తేదీ నుండి మొదలుకొని లాండ్ లైన్, ఇంటెర్నెట్ సర్వీస్ లు మరియు మొబైల్ ఫోన్లకు వర్తిస్తుందని వారు తెలిపారు. ఈ విధంగా తాత్కాలికంగా నిలిపివేయబడే సేవలు, బిల్లు చెల్లించబడిన తరువాత పునరుద్ధరించబడతాయని తెలియచేశారు. ఐతే, గ్రేస్ పెరియడ్ అవధిని పెంచాలని ప్రజలు, వినియోగదారులు డిమాండు చేస్తున్నట్టు సమాచారం! ఎతిసలాత్ ప్రధాన పోటీదారు ఐన డ్యూ, బిల్లు చెల్లించడానికి ఇచ్చిన 10 రోజుల గ్రేస్ పెరియడ్ ను జూన్ 2011లో రద్దుచేయడం గమనార్హం!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









