ఏపీ ఫైబర్ నెట్ సంచలన నిర్ణయం
- December 24, 2024
అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ హయాంలో అక్రమ నియామకాలు జరిగాయని తెలిపారు. వైసీపీ నేతల సిఫార్సులతో అడ్డగోలు నియామకాలు చేశారన్నారు. ఎక్కువ మందిని అవసరం లేకున్నా నియమించారని జీవీ రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వ సంస్థ అక్రమాలకు అడ్డాగా
ఏపీలో ఫైబర్ నెట్ పేరుతో కేబుల్ ప్రసారాలు, ఇంటర్నెట్ పంపిణీదారుగా ఉన్న ప్రభుత్వ సంస్థ అక్రమాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఫైబర్ నెట్ ను తమ జేబు సంస్థగా వాడుకుని అందులో భారీ ఎత్తున ఉద్యోగుల్ని సిఫార్సులతో నియమించారు. వీరితో ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఫైబర్ నెట్ కనెక్షన్లు 10 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గిపోయాయి. దీంతో ఇందులో ప్రక్షాళన ప్రారంభించిన ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రక్షాళన చేపట్టిన జీవీ
ముఖ్యంగా వంట మనుషులు, డ్రైవర్లను ఫైబర్ నెట్ లో ఉద్యోగులుగా నియమించారన్నారు. వీరంతా వైసీపీ నేతల ఇళ్లలో వంట మనుషులు, డ్రైవర్లుగా పనిచేస్తున్నారని జీవీ రెడ్డి తెలిపారు. అందుకే వీరిని గుర్తించి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా అక్రమ నియామకాలపై దృష్టిపెట్టడంతో పాటు ఫైబర్ నెట్ కనెక్షన్ల ఛార్జీల తగ్గింపు, కొత్త కనెక్షన్లను తక్కువ ధరకే ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







