6 నెలల లోపు రెండోసారి బేసిక్ కమోడిటీల ధరలను పెంచలేరు..!!
- December 25, 2024
యూఏఈ: వచ్చే ఏడాది నుంచి బేసిక్ కమోడిటీల ధరలను వరుసగా రెండుసార్లు పెంచే మధ్య కనీసం ఆరు నెలల వ్యవధిని యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వినియోగదారులను రక్షించడానికి, పోటీని పెంచడానికి దేశంలోని రిటైలర్లు ముందస్తు అనుమతి లేకుండా తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల ధరలను పెంచలేరని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వస్తువులలో వంట నూనె, గుడ్లు, పాల ఉత్పత్తులు, బియ్యం, చక్కెర, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు ఉన్నాయి. కొత్త మార్పులు జనవరి 2, 2025 నుండి అమలులోకి వస్తాయి.
నిత్యావసర వినియోగ వస్తువుల ధరలను పర్యవేక్షించేందుకు గతంలో ధరల విధానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. స్థానిక అధికారులతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ, నిత్యావసర వినియోగ వస్తువుల సరఫరాదారులు, రిటైలర్లు, డిజిటల్ వ్యాపారులు.. వినియోగదారుల కోసం కొత్త విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. కొత్త విధానం ప్రకారం.. రిటైల్ దుకాణాలు పారదర్శకతను ప్రోత్సహించడానికి యూనిట్ ధరలను ప్రదర్శించాలని మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండర్ సెక్రటరీ అబ్దుల్లా అహ్మద్ అల్ సలేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







