6 నెలల లోపు రెండోసారి బేసిక్ కమోడిటీల ధరలను పెంచలేరు..!!
- December 25, 2024
యూఏఈ: వచ్చే ఏడాది నుంచి బేసిక్ కమోడిటీల ధరలను వరుసగా రెండుసార్లు పెంచే మధ్య కనీసం ఆరు నెలల వ్యవధిని యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వినియోగదారులను రక్షించడానికి, పోటీని పెంచడానికి దేశంలోని రిటైలర్లు ముందస్తు అనుమతి లేకుండా తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల ధరలను పెంచలేరని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వస్తువులలో వంట నూనె, గుడ్లు, పాల ఉత్పత్తులు, బియ్యం, చక్కెర, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు ఉన్నాయి. కొత్త మార్పులు జనవరి 2, 2025 నుండి అమలులోకి వస్తాయి.
నిత్యావసర వినియోగ వస్తువుల ధరలను పర్యవేక్షించేందుకు గతంలో ధరల విధానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. స్థానిక అధికారులతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ, నిత్యావసర వినియోగ వస్తువుల సరఫరాదారులు, రిటైలర్లు, డిజిటల్ వ్యాపారులు.. వినియోగదారుల కోసం కొత్త విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. కొత్త విధానం ప్రకారం.. రిటైల్ దుకాణాలు పారదర్శకతను ప్రోత్సహించడానికి యూనిట్ ధరలను ప్రదర్శించాలని మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండర్ సెక్రటరీ అబ్దుల్లా అహ్మద్ అల్ సలేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!









