దుబాయ్ మెట్రో..43 గంటల పాటు నాన్స్టాప్ సేవలు..!!
- December 25, 2024
యూఏఈ: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో దుబాయ్ మెట్రో, ట్రామ్ డిసెంబర్ 31 నుండి 43 గంటలకు పైగా నాన్స్టాప్గా పనిచేస్తాయని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రజా రవాణాను ఉపయోగించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.
దుబాయ్ మెట్రో కోసం.. డిసెంబర్ 31 ఉదయం 5 గంటల నుండి జనవరి 1 చివరి వరకు పనివేళలు ఉంటాయి. అదే సమయంలో దుబాయ్ ట్రామ్ డిసెంబర్ 31 ఉదయం 6 నుండి జనవరి 2 ఉదయం 1 గంటల వరకు పనిచేస్తుంది. ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండేలా 1,400 బస్సులను అందుబాటులో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రోడ్లు రవాణా అథారిటీ (RTA) ట్రాఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్సేన్ అల్ బనా తెలిపారు.
దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ సాయంత్రం 5 గంటల నుండి మూసివేయబడుతుందని, ఉత్సవాలకు చేరుకోవడానికి సమీపంలోని మెట్రో స్టేషన్ను ఉపయోగించాలని ఆయన సూచించారు. "ట్రాఫిక్ రద్దీలను నివారించడానికి దుబాయ్ మెట్రోను ఉపయోగించాలని మేము ప్రజలను కోరుతున్నాము. అన్ని మెట్రో స్టేషన్లు పనిచేస్తాయి. కొన్ని స్టేషన్లలో రద్దీని నివారించడానికి ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. కొన్ని సమయాల్లో మేము రద్దీని నివారించడానికి బుర్జ్ ఖలీఫా వంటి కొన్ని స్టేషన్లను మూసివేస్తాము. మేము బిజినెస్ బే స్టేషన్పై ఆధారపడతాము." అని అల్ బనా వివరించారు.
దుబాయ్ పబ్లిక్ పార్క్లు రాత్రి 1 గంటల వరకు పనిచేస్తాయని దుబాయ్ మునిసిపాలిటీ ఎమర్జెన్సీ అండ్ క్రైసిస్ టీమ్ హెడ్ అడెల్ మహ్మద్ అల్ మర్జౌకి తెలిపారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఫైర్ వర్క్స్, డ్రోన్ ప్రదర్శన దుబాయ్లోని మొత్తం 36 ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు. ప్రధాన వేడుకలు బుర్జ్ పార్క్, గ్లోబల్ విలేజ్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, అల్ సీఫ్, బ్లూవాటర్స్, ది బీచ్ ఎట్ JBR, హట్టా లలో నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







