తల్లితో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
- December 25, 2024
అమరావతి: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాలుగు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన తల్లి చేయి పట్టుకుని కేక్ కట్ చేయించారు. కుమారుడిని దగ్గరకు తీసుకుని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. అంతకుముందు క్రిస్మస్ వేడుకల కోసం చర్చికి చేరుకున్న జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్, విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. గురు, శుక్రవారం కూడా మాజీ సీఎం కడప జిల్లాలో పర్యటించనున్నారు. కాగా, క్రిస్మస్ వేడుకల సందర్భంగా కొత్త సంవత్సరం క్యాలెండర్ను జగన్ ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









